గ్యాంగ్ రేప్: ఆ నలుగురు కామాంధులకు ఉరి శిక్ష
ఇస్లామాబాద్: బాలికల మీద అత్యాచారం చేసిన నలుగురు కామాంధులకు పాకిస్థాన్ లో ఉరి శిక్ష విధించారు. మంగళవారం ఇద్దరిని, బుధవారం ఇద్దరిని ఉరి తియ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సలీమ్, నౌమన్ లను ఉరి తియ్యనున్నారు.
అదే విధంగా బుధవారం అబిద్ మసూద్, సనావుల్లాలను ఉరి తియ్యడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ లోని సాయిల్కోట్ జిల్లా జైలులో వీరు నలుగురిని ఉరి తీస్తున్నారు. వీరు నలుగురు ఇద్దరు మైనర్ బాలిలక మీద గ్యాంగ్ రేప్ చేశారు.

1999లో నౌమన్, సలీమ్ ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఇద్దరు పదేపదే అత్యాచారం చెయ్యడంతో బాలిక తీవ్రఅస్వస్థతకు గురైయ్యింది. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. బాలిక మీద అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు.
1997లో అబిద్ మసూద్, సనావుల్లా 15 సంవత్సరాల బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. పోలీసుల విచారణలో నిందితులు గ్యాంగ్ రేప్ చేసినట్లు వెలుగు చూసింది. ఇద్దరు నేరం అంగీకరించారు. వీరిద్దరిని ఏప్రిల్ 22 వ తేది బుధవారం ఉరి తీస్తున్నారు.
2014 డిసెంబర్ 16వ తేదిన పెషావర్ లోని ఆర్మి స్కూల్ మీద పడిన తాలిబన్ టెర్రరిస్టులు కాల్పులు జరిపి 150 మంది పిల్లలను పోట్టన పెట్టుకున్నారు. అప్పటి వరకు పాకిస్థాన్ లో ఉరి శిక్షపై నిషేధాన్ని ఎత్తి వేశారు. అప్పటి నుండి వివిద కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వెంటవెంటనే ఉరి శిక్ష అమలు చేస్తున్నారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications