అమెరికా ఎంబసీ మా లక్ష్యం: తాలిబన్
కాబుల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగానే తాము ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని తాలిబన్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నాం కాబూల్ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిందని అఫ్ఘానిస్థాన్ పోలీస్ చీఫ్ జనరల్ అబ్దుల్ రెహమాన్ రహామి తెలిపారు.
ఈ దాడిలో ఉగ్రవాది టయోట కరోలా కారులో వేగంగా వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. అమెరికా రాయబారి కార్యాలయం- అఫ్ఘానిస్థాన్ సుప్రీం కోర్టు మద్యలో మిలటరి బలగాలు ఉగ్రవాది వెళుతున్న కారును అడ్డుకుంటున్న సమయంలో మిలటరి బలగాల వాహనాల దగ్గరే ఉగ్రవాది కారులోనే తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ ఆత్మాహుతి దాడిలో ఒక పౌరుడు దుర్మరణం చెందాడు. 22 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి జరిగిన వెంటనే మిలటరి అధికారులు అలర్ట్ అయ్యారు. కాబూల్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు.
ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామే అని తాలిబన్ ఉగ్రవాదులు ట్విట్టర్ లో ప్రకటించుకున్నారు. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా తాము ఈ దాడికి పాల్పడ్డామని చెప్పారు. ముందు జాగ్రత చర్యగా కాబూల్ లోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications