తనిఖీల పేరిట అవమానం: టిమ్ కుక్కు ఉద్యోగులు
యాపిల్ రిటైల్ స్టోర్లలో సెక్యూరిటీ పరమైన జాగ్రత్తల పేరుతో ఉద్యోగులను తనిఖీ చేయడం, వారి బ్యాగులను సైతం చెక్ చేస్తుండటంపై రెండు యాపిల్ స్టోర్లకు చెందిన ఉద్యోగులు సంస్ధ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్కు లేఖ రాశారు.
ఈ తనిఖీలు తమను కించపరిచే విధంగా ఉన్నాయని, ఈ చర్యలను తాము అవమానకరంగా భావిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. 2013లో ఫైల్ చేసిన ఓ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ లేఖను బహిర్గతం చేశారు.
యాపిల్ స్టోర్ మేనేజర్లు ఉద్యోగస్తులను క్రిమినల్స్ మాదిరిగా చూస్తున్నారని వారు ఆ లేఖలో ఆరోపించారు. దీంతో టిమ్ కుక్కు అందిన లేఖను హెచ్ఆర్ విభాగానికి చెందిన అధిపతికి పంపించి 'ఇది నిజమా?' అని ప్రశ్నించారు.

అయితే హెచ్ఆర్ విభాగం నుంచి టిక్ కుక్కు వెళ్లిన సమాధానం మాత్రం తెలియలేదు. అమెరికాలోని రెండు యాపిల్ స్టోర్లలో పనిచేస్తోన్న ఉద్యోగులు తనిఖీలు చేసినందుకు గాను తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసు కాలిఫోర్నియాలోని ఉత్తర కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు వేసిన అమండా ఫ్రైకిన్, డీన్ పీల్లే మాట్లాడుతూ భోజన సమయ విరామాల్లో కూడా తమపై సేల్స్ విభాగం వ్యక్తులు తనిఖీలు నిర్వహించే వారని తెలిపారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications