పట్టువదలని విక్రమార్కుడు: పెన్సిల్వేనియాలో కూడా చీట్, దావా వేసిన డొనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. పెన్సిల్వేనియాలో నిబంధనలు ఉల్లంఘించారంటూ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. సోమవారం పెన్సిల్వేనియా సెక్రటరీ, ఏడు కౌంటీలపై దావా వేశారు. ఆ ఎన్నికను ధృవీకరించకుండా నిషేధం విధించాలని కోరారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి అవినీతి లేదు, కలిసి పనిచేద్దాం: జార్జ్ డబ్ల్యూ బుష్
పెన్సిల్వేనియాలోని ఫెడరల్ జిల్లా కోర్టులో ట్రంప్ దావా వేశారు. రెండంచెల ఓటింగ్ విధానాన్ని ఉపయోగిచారని పేర్కొన్నారు. ఇదీ చట్టవిరుధ్దం అని పేర్కొన్నారు. ఇందులో ఓటర్లు వ్యక్తిగతంగా ఓటు వేశారో లేదంటే బ్యాలెట్లను మెయిల్ ద్వారా సమర్పించారా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కానీ ఈ దావాను పెన్సిల్వేనియా అటార్నీ జనరల్ జోష్ షాపిరో కొట్టిపారేశారు.
పెన్సిల్వేనియా ఎన్నికల సవాల్ చేయడానికి అర్హత లేని వాజ్యం అని తెలిపారు. చట్ట, న్యాయద్దంగా వ్యవహరించామని పేర్కొన్నారు. ఈ స్థాయిలో జోక్యం చేసుకోవడానికి కోర్టులకు ఎలాంటి అర్హత లేదని తెలిపింది. ఎన్నికల్లో కామన్వెల్ చట్టం సమర్థించబడుతోందని.. ప్రజల అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం జరుగుతుందని భావిస్తోన్నానని తెలిపారు.
దావాలో కొన్ని కౌంటీలలో ఓటర్ల పట్టిక పరిశీలించే అవకాశం లేదు. ఫిలడెల్పియా కౌంటీ ఉత్తర్వు పాటించడంలో విఫలమైందని గుర్తుచేశారు. దీంతో ఎన్నికల నిర్వహణలో మోసం జరిగిందని చెప్పలేమని తెలిపారు. ఇదీ ఓటర్ల నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతోందని తెలిపారు. ఫెన్సిల్వేనియా సెక్రటరీ క్యాతీ బూక్వార్, బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్, చెస్టర్, దెలవరే, ఫిలడెల్పియా, మోంటెమరీపై కూడా దావా వేశారు. దీనిని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ నానీ, రిపబ్లికన్ అధికారులు మీడియాకు వివరించారు.