ఎంహెచ్ 370: ఇప్పించాలని దావా వేసిన చిన్నారులు
కౌలాలంపూర్: దాదాపు ఎనిమిది నెలల క్రితం మలేషియాకు చెందిన ఎంహెచ్ 370 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. ఇందులోని ప్రయాణీకులు అందరు మృతి చెందారు. అయితే, ఈ విమానం గల్లంతుకు సంబంధించి ఇద్దరు చిన్నారులు కౌలాలంపూర్ హైకోర్టులో దావా వేశారు.
ఎంహెచ్ 370 విమానంలో ప్రయాణిస్తున్న తన తండ్రి మృతికి మలేషియా ఎయిర్ లైన్స్, ప్రభుత్వమే కారణమని చిన్నారులు శుక్రవారం ఈ దావా వేశారు. ఎంహెచ్ 370 గల్లంతుకు సంబంధించి.. అందులో మృతి చెందిన వారి బంధువులు కోర్టుకు ఎక్కడం ఇదే ప్రథమం!
జీ కిన్సన్ (13), జీ కిన్లాండ్ (11) అనే ఇద్దరు చిన్నారులు సివిల్ ఏవియేషన్ డిపార్టుమెంట్ తీరును తమ దావాలో తప్పుపట్టారు. ఎంహెచ్ 370 విమానానికి రాడార్తో సంబంధం తెగిపోయిన వెంటనే దానిని గుర్తించేందుకు సరైన ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు.

ఈ వాద్యాన్ని చిన్నారులు శుక్రవారం నాడు కౌలాలంపూర్ హైకోర్టులో వేశారు. విమానం సురక్షితంగా ప్రయాణించేందుకు చేపట్టాల్సిన అన్న చర్యలను తీసుకోవడంలో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వహించిందన్నారు.
తాము ఎనిమిది నెలలు వేచి చూశామని, పలువురు అధికారులు, నిపుణులతో మాట్లాడాక దీనిని దాఖలు చేశామని చిన్నారుల తరఫు న్యాయవాది అరుణన్ సెల్వరాజ్ తెలిపారు. కేసు బలంగా ఉండేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.
టెక్నాలజీ ఇంతగా పెరిగిన ఈ కాలంలో, ఇంత పెద్ద విమానం అదృశ్యం కావడం ఏమిటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, దావా వేసిన ఇద్దరు చిన్నారులు... తమ మనోవేదన, తండ్రి జీ జింగ్ హాంగ్ అదృశ్యమైన నేపథ్యంలో తమకు జరిగిన నష్టం తదితరాలకు పరిహారం చెల్లించాలని వారు దావా వేశారు. వారి తండ్రి జీ జింగ్ హంగ్ ఓ ఇంటర్నెట్ సంబంధిత వ్యాపారం చేసేవాడు. అతను నెలకు సుమారు 5,200 డాలర్గుగా ఉండేదట.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications