యూఎస్ క్యాపిటల్ వద్ద కాల్పుల కలకలం: పోలీస్, డ్రైవర్ మృతి
అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. యూఎస్ క్యాపిటల్ వద్ద ఆగంతకులు పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టారు. తర్వాత కాల్పులు జరపడంతో ఓ పోలీస్ చనిపోయారు. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు ఒకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ క్యాపిటల్ పోలీస్ చీఫ్ యోగానంద పీట్మ్యాన్ తెలిపారు. ఆ తర్వాత నగరంలో ఆంక్షలు విధించారు. బయటివారిని అనుమతించడం లేదు.

భద్రతా బలగాలు, ఆగంతకుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. కారు డ్రైవర్ కత్తి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అతనిని భద్రతా బలగాలు ఫైర్ చేసి చంపేశారు. ఒక అనుమానితుడు కస్టడీలో ఉన్నారని.. అధికారులు గాయపడ్డారని తెలిపారు. ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించామని ట్వీట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజీలో మాత్రం బ్లూ కలర్ సెడాన్ కారు కనిపించింది. అదీ భద్రతా సిబ్బంది కారును ఢీ కొట్టింది. ఆ వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్ ద్వారా గాయపడ్డవారిని ఆస్పత్రికి తలరించారు. ఆ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. ట్రంప్కు అనుకూలంగా మద్దతుదారులు ఆందోళన చేపట్టిన తర్వాత ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ సమయంలో ఐదుగురు జనం, పోలీసు అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అవక తవకలు జరిగాయని అప్పుడు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications