అమెరికా నిర్ణయం: భారత ఐటీ కంపెనీలపై దెబ్బ
వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలకు ఇబ్బంది కలిగించే వార్త. అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం మన ఐటీ కంపెనీలపై పెను భారాన్ని మోపనుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు ఇది వివక్షపూరితమైన నిర్ణయమని ఆరోపిస్తున్నారు.
భారత్కు ఎంతో మేలు చేస్తున్నామని గొప్పగా చెబుతోన్న ఒబామా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య ఉన్న సత్సంబంధాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపుతోందని అంటున్నారు.
అసలు ఇంతకీ ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా? ఒక్కో హెచ్-1బీ వీసాకు ఇండియన్ ఐటీ కంపెనీలు అదనంగా కనీసం 4 వేల డాలర్లు, ఒక్కో ఎల్-1 వీసాకు 4,500 డాలర్లు చెల్లించాల్సి రావడమే. గత డిసెంబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు 2025 సెప్టెంబరు 30 వరకు అమల్లో ఉంటాయి.
ఈ మేరకు అమెరికా ఫెడరల్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం తన వెబ్సైట్లో ఉంచింది. హెచ్-1బీ వీసా వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే భారత్లోని ఐటీ ఉద్యోగులను అమెరికాలోని పలు కంపెనీ యజమానులు రప్పించుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇదిలా ఉంటే అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కార్యాలయాలు కలిగిన అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగులకు ఎల్-1 వీసాలు లభిస్తాయి. ఈ కొత్త నిబంధన వల్ల భారతీయ ఐటీ కంపెనీలపై ప్రతి ఏటా 400 మిలియన్ డాలర్ల అదనపు భారం పడుతోంది. దీంతో ప్రధాని మోడీ ఈ విషయమై అమెరికాతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.
హెచ్-1బీ పిటిషనర్లు తమ కంపెనీలో 50 లేదా అంతకన్నా ఎక్కువ మంది సిబ్బంది అమెరికాలో ఉన్నపుడు, ఆ సిబ్బందిలో సగం కన్నా ఎక్కువ మంది హెచ్-1బీ, ఎల్-1ఏ లేదా ఎల్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్లో ఉంటే తప్పనిసరిగా అదనంగా 4 వేల డాలర్లు చెల్లించాలనేది కొత్త నిబంధన.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications