నో సారీ: ఆ ఘనత ఒబామాదే, నివాళి(ఫోటోలు)
హిరోషిమా: జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు శుక్రవారం హిరోషిమా స్మారక స్థూపాన్ని సందర్శించి పుష్ప నివాళి సమర్పించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు కళ్లు మూసుకుని మౌనం పాటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా తన అణు బాంబుని హిరోషిమా నగరంపై ప్రయోగించింది.
అణుబాంబు దాడి వల్ల హిరోషిమాలో సుమారు 1,40,000 మంది మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి చేసిన తర్వాత తొలిసారి ఓ అమెరికా అధ్యక్షుడు హిరోషిమా స్థూపాన్ని సందర్శించిన ఘనత బరాక్ ఒబామాకే చెందింది.
ఒబామా వెంట జపాన్ ప్రధాని ప్రధాని షింజో అబే కూడా హిరోషిమా స్ధూపం వద్ద నివాళి అర్పించారు. 1945, ఆగస్టు 6న అమెరికా హిరోషిమా నగరంపై అణు బాంబుని ప్రయోగించింది. సుమారు 70 ఏళ్ల కిందట జరిగిన ఈ అణుదాడి మానవ సమాజాన్ని రూపుమార్చే శక్తి అని తెలిసిపోయింది.
ఈ సందర్భంగా బరాక్ ఒబామా మాట్లాడుతూ అణు బాంబు దాడి జరిగిన ఘటనను కేవలం మాటలతో వర్ణించలేమన్నారు. ఆ నాటి గుర్తులు మనతోనే ఉండిపోతాయన్నారు. ఆ ఆలోచనలే మనకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆ దురదృష్టకరమైన సంఘటన నుంచి ఆ ఆలోచనలే మనకు ఆశను నింపాలన్నారు.
"Flash of light & a wall of fire destroyed a city." President Obama @POTUS is making a historic visit to #hiroshima https://t.co/BREBdaVQ5V
— Victoria Derbyshire (@VictoriaLIVE) 27 May 2016

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి
అణు బాంబు దాడి జరిగిన తర్వాత ఏర్పడ్డ మేఘాల్ని మనం మరవలేమన్నారు. ఆ గుర్తులు మానవత్వాన్ని వీడలేవన్నారు. సైన్స్ అద్భుతాలు మరింత మెరుగైన కిల్లింగ్ మెషీన్లను తయారు చేయగలవన్నారు. అణు బాంబు దాడి వల్ల మరణించిన వారి ఆత్మలు మనతో మాట్లాడుతున్నాయని చెప్పారు. యుద్ధం ఒక్కటే హిరోషిమాను వేరు చేయలేదన్నారు.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి
జపాన్, అమెరికా మిత్రదేశాలే కాదు, ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు మధ్య స్నేహం ఉందన్నారు. నిరంతర ప్రయత్నం వల్ల చేదు జ్ఞాపకాలను మరిచిపోవచ్చన్నారు. మనది మానవ జాతి. మళ్లీ మనం ఒకటి కావచ్చు. మనం నేర్చుకోవచ్చు. మన ఇష్టాన్ని ఎన్నుకోవచ్చు. మన పిల్లలకు భిన్నమైన కథలను చెప్పుకోవచ్చు.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి
క్రూరత్వం లేని సమాజాన్ని సృష్టించడమే ధ్యేయమన్నారు. బాంబు దాడిలో మరణించినవాళ్లు మన లాంటివాళ్లేనని కొందరు అనుకుంటారు. యుద్ధం అవసరం లేదన్న ఆలోచనలో వాళ్లు ఉంటారు. సైన్సు అభివృద్ధి వల్ల జీవితాలు మరింత మెరుగుపడాలని భావిస్తారు. శాంతి ఎంతో విలువైందన్నారు.
సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి
అయితే 1946లో హిరోషిమాపై అమెరికా అణు బాంబు దాడి ఘటనపై బరాక్ ఒబామా క్షమాపణ చెప్పక పోవడం విశేషం. రెండో ప్రపంచ యుధ్దంలో తొలుత ఆగస్టు 6న హిరోషిమాపై అణు దాడి చేసిన అమెరికా ఆ తర్వాత ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబుని ప్రయోగించింది.

సారీ చెప్పలేదు: హిరోషిమాలో ఒబామా, నివాళి
ఈ రెండు సిటీల అణు బాంబు దాడి ఘటనలో మొత్తం 220,000 మంది అధికారికంగా ధ్రువీకరించారు. కాగా హిరోషిమాలో ఒబామా పర్యటించడం చరిత్రాత్మకమని జపాన్ ప్రధాని అబే అన్నారు. ప్రపంచ ప్రజలు అణ్వస్త్ర రహిత సమాజాన్ని కోరుకుంటున్నారన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications