వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిని చూసి నోరు వెళ్లబెడుతున్న జపాన్ ప్రజలు
భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాల్ని తనవైపు తిప్పుకుంది భారత్. భారత్ ఆయుధ సంపత్తి, సైనికుల తెగువ చూసి అవాక్కయ్యాయి. అయితే తాజాగా మరోసారి భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. జపాన్ లో జరుగుతున్న వరల్డ్ ఎక్స్ పోలో భారత్ కు చెందిన వందే భారత్ ఎక్స్ ప్రెస్, చీనాబ్ బ్రిడ్జి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని చూసిన ప్రపంచ దేశాల ప్రజలు వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
జపాన్ ఒసాకా లోని యుమేషిమా అనే ద్వీపంలో వరల్డ్ ఎక్స్ పో- 2025 కొనసాగుతోంది. ఏప్రిల్ 13 న ప్రారంభం అయిన ఈ ఎగ్జిబిషన్ అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ప్రపంచ దేశాల పర్యటకులు నిత్యం లక్షలాది మంది ఈ ఎక్స్ పోను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ నుంచి ఏర్పాటు చేసిన వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిల కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టూరిస్టులు వీటిని చూసి.. ఆ ప్రాజెక్ట్ ల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే చీనాబ్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా చరిత్రలో నిలిచింది.

ఒసాకాలోని యుమేషిమా ద్వీపంలో ఏర్పాటు చేసిన ఈ వరల్డ్ ఎక్స్ పో- 2025 అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ లక్షలాది మంది టూరిస్టులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి ప్రపంచ దేశాల కళాకృతులకు ముగ్ధులవుతున్నారు. వీటిల్లో వందే భారత్, చీనాబ్ బ్రిడ్జిల కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిని పోటీపడి మరీ జపాన్ తో పాటు ఇతర దేశాల ప్రజలు తిలకిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ల విశేషాలు తెలుసుకుని ఔరా అంటున్నారు.
India’s engineering marvels – Vande Bharat, Chenab Bridge, and Anji Bridge – win admiration at the India Pavilion, World Expo 2025, Osaka, Japan.#IndiaAtExpo2025 #BharatAtExpo2025 #Expo2025Osaka #ConnectingHimalayasWithMountFuji #HelloEXPO2025 #CulturalConnections pic.twitter.com/5960T98qE2
— Ministry of Railways (@RailMinIndia) July 9, 2025
ఇదే విషయంపై భారతీయ రైల్వే శాఖ అధికారులు మాట్లాడుతూ.. చీనాబ్ బ్రిడ్జి విశేషాలను ప్రపంచం ముందు ఉంచడం ఇదే తొలిసారని తెలిపారు. ఈ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు పొందడంతో ప్రదర్శనకు ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ బ్రిడ్జితో పాటు దేశంలోనే మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జిగా పేరు పొందిన అంజి కధ్ బ్రిడ్జి కళాకృతిని సైతం ప్రదర్శనకు ఉంచినట్లు వివరించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications