నేపాల్ భూకంపం: బతుకులు ఛిద్రం, కన్నీటితో స్వదేశానికి(ఫోటోలు)
న్యూఢిల్లీ: వరుస భూప్రకంపనలు దాటికి నేపాల్ అతలాకుతమైంది. నేపాల్లో ప్రజలు నీరు, ఔషధాలు, కరెంట్ లేక విలవిలలాడుతున్నారు. భూప్రకంనల భయానికి వేలాదిమంది ఇళ్లలోంచి బయటికొచ్చి బహిరంగ ప్రదేశాల్లో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
ఇక శిథిలాల కింద నుంచి వెలికితీస్తున్న మృతదేహాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సోమవారం నాటికి భూకపం మృతుల సంఖ్య నాలుగువేలకు చేరింది. భూకంపం సృష్టించిన విలయంలో నేలమట్టమైన భవన శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించడం కోసం సుశిక్షిత జాగిలాలను సోమవారం రంగంలోకి దించారు.
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆరు జాగిలాలతో 15 మంది సిబ్బంది ఈ పని మీదే ఉన్నారు. అలాగే భారత్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా తమ వెంట తీసుకొచ్చిన జాగిలాలతో ఈ పని మీదే ఉన్నారు.
ఇక నేపాల్ రాజధాని ఖాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం స్వదేశానికి తరలివెళ్లడానికి వేచి చూస్తున్న ప్రయాణికులకో కిటకిటలాడుతోంది. భూకంపం కారణంగా భయభ్రాంతులకు గురైన భారతీయులు ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఎదురుచూస్తున్నారు.
జీవనోపాధి కోసం చాలా మంది భారతీయులు నేపాల్ వెళ్లి స్ధిరపడ్డారు. భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు.
ప్రయాణికులు తీవ్రత రద్దీగా ఉండటంతో మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు గాయపడిన వారికి తొలుత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియన్ ఎంబసీ నుంచి సీనియర్ అధికారి ప్రభాత్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 2,500 మంది భారతీయులను తరలించామన్నారు.
నేపాల్కు మరింతగా సహాయక సేవలందించేందుకు గాను భారత్ నుంచి ఖాఠ్మండుకు వెళ్లే రోడ్డు మార్గాన్ని సోమవారం తెరిచారు. దీంతో సహాయక సామాగ్రి తరలింపు మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం భారత్కు చెందిన 450 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
భూకంపంలో భూకంప తాకిడికి తీవ్రంగా గాయపడిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఇండియన్ ఆర్మీ, వాయుసేన సిబ్బంది.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
PTI4_27_2015_000233B
ప్రయాణికులు తీవ్రత రద్దీగా ఉండటంతో మహిళలు, పిల్లలు, వృద్ధులతో పాటు గాయపడిన వారికి తొలుత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇండియన్ ఎంబసీ నుంచి సీనియర్ అధికారి ప్రభాత్ సింగ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 2,500 మంది భారతీయులను తరలించామన్నారు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలిస్తోన్న దృశ్యం. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత్కు వచ్చిన నేపాల్ భూకంప బాధితులు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలిస్తోన్న దృశ్యం. అహ్మాదాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్ట్ లో నేపాల్ భూకంప బాధితులు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలి వస్తోన్న దృశ్యం. అహ్మాదాబాద్లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్ట్ లో నేపాల్ భూకంప బాధితులు. తండ్రికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తోన్న ఓ కూతురు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలి వస్తోన్న దృశ్యం. అమృత సర్లో విమానాశ్రాయం బయట తన భార్యను హత్తుకొని ఓదార్చుతున్న నేపాల్ భూకంప బాధితుడు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలి వస్తోన్న దృశ్యం. అమృత సర్లో విమానాశ్రాయం బయట ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటున్న నేపాల్ భూకంప బాధితులు.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల
నేపాల్ భూకంపం నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తరలి వస్తోన్న దృశ్యం. న్యూఢిల్లీలోని పాలెం విమానాశ్రాయంలో నేపాల్ భూకపం బాధితురాలని నెమ్మదిగా బయటకు బయటకు తీసుకువస్తున్న వాయుసేన సిబ్బంది.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపానికి భయభ్రాంతులకు గురైన భారతీయులు ఇంటికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద బంధువుల ఎదురుచూపులు చూస్తున్న దృశ్యం.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపానికి భయభ్రాంతులకు గురైన భారతీయులు ఇంటికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద బంధువుల ఎదురుచూపులు చూస్తున్న దృశ్యం.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపానికి భయభ్రాంతులకు గురైన భారతీయులు ఇంటికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద బంధువుల ఎదురుచూపులు చూస్తున్న దృశ్యం.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ భూకంపానికి భయభ్రాంతులకు గురైన భారతీయులు ఇంటికి చేరుకుంటున్నారు. భూకంపం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో భారతీయులను తరలించడానికి అటు వాణిజ్య విమానాలతో పాటు వాయుసేనకు చెందిన విమానాలను కూడా రంగంలోకి దించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద బంధువుల ఎదురుచూపులు చూస్తున్న దృశ్యం.

నేపాల్లో భూకంపం, నాలుగు వేలకు చేరిన మృతుల సంఖ్య
నేపాల్ అండర్ - 14 పుట్ బాల్ ఆడేందుకు వెళ్లిన బాలికల బృందం. నేపాల్ భూకంప నేపథ్యంలో భారత్కు తిరిగి వచ్చారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications