మరో మైలురాయికి వాట్సప్: యూజర్ల సంఖ్య 100 కోట్లు
ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సప్ ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్స్ బర్గ్ తన ఫేస్బుక్ పేజి ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వాట్సాప్ సహ వ్యవస్థాపకులు బ్రెయిన్ ఆక్టన్, జాన్ కోమ్ను ఆయన అభినందించారు.
ఫేస్బుక్కు చెందిన ఈ యాప్ను సోమవారం నాటికి వంద కోట్ల మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2014లో ఫేస్బుక్ యాజమాన్యం వాట్సాప్ను సొంతం చేసుకున్నాక యూజర్లు సంఖ్య గణనీయంగా పెరిగింది. తమ యాప్ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కృతజ్ఞతలు తెలిపారు.
'ఫేస్బుక్లో చేరాక వాట్సాప్ యూజర్లు రెట్టింపు అయింది. వాట్సాప్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. మా తర్వాతి లక్ష్యం ఈ సర్వీసును వ్యాపారంతో అనుసంధానిస్తాం' అని తన ఫేస్బుక్ పేజీలో జూకర్స్ బర్గ్ పోస్టు చేశారు.

యాహూ మాజీ ఉద్యోగులైన బ్రెయిన్ ఆక్టన్, జాన్ కోమ్ 2009లో వాట్సాప్ను స్థాపించారు. దీన్ని 2014 ఫిబ్రవరి 19న 19.3 బిలియన్ డాలర్లకు ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అప్పటికి 50 మిలియన్లు ఉన్న యూజర్ల సంఖ్య కేవలం రెండేళ్లలో రెట్టింపు అయింది.
'ప్రతినెలా ప్రపంచంలో ఏడుగురిలో ఒకరు వాట్సాప్ను ఉపయోగిస్తున్నారు. ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమాచారం పంచుకుంటున్నారు. జాతీయ విపత్తులు, ఆరోగ్య సమస్యల నుంచి శుభకార్యాలు, వ్యాపారాల వరకు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు' అని వాట్సప్ టీమ్ ఈ సందర్భంగా పేర్కొంది.
ఇది ఇలా ఉంటే, వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సప్ ద్వారా రోజుకు 42 కోట్ల మెసేజ్లను షేర్ చేసుకుంటున్నారు. 1.6 బిలియన్ ఫొటోలు షేర్ అవుతున్నాయి. 1 బిలియన్ గ్రూపులు వాట్సప్లో ఉన్నాయి.
One billion people now use WhatsApp. Congrats to Jan, Brian and everyone who helped reach this milestone! WhatsApp's...
Posted by Mark Zuckerberg on Monday, February 1, 2016
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications