భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై 7 దేశాల ఆసక్తి ? రీజన్ ఇదే..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకున్న పీఎల్-15ఈ క్షిపణిని పాకిస్తాన్ J-10C లేదా JF-17 జెట్ ద్వారా భారత్ పైకి ప్రయోగించింది. అయితే భారత్ దీన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈ క్షిపణి శిథిలాలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని కమాహి దేవి గ్రామం సమీపంలో దొరికాయి. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన చైనా క్షిపణి పీఎల్ 15ఈని కూల్చేసిన తర్వాత వాటి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. పాకిస్తాన్ కు చైనా అందిస్తున్న సాయం ఏ స్ధాయిలో ఉందో అందరికీ అర్ధమైంది. అదే సమయంలో
పీఎల్ 1ఈ క్షిపణిలోని ముఖ్యమైన భాగాలు, దాని ప్రొపల్షన్, డేటా-లింక్, ఇనర్షియల్ యూనిట్ , అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే సీకర్ సహా ఏవీ చెక్కుచెదరలేదని నిపుణులు తేల్చారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు.

why 7 nations keen on debris of Chinese PL-15E missile used by Pakistan against india

చైనా క్షిపణి పీఎల్ 15ఈని భారత్ విజయవంతంగా కూల్చేసినా అందులో అమర్చిన వ్యవస్థలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో వీటిని అధ్యయనం చేసేందుకు భారత్ కు మంచి అవకాశం లభించింది. అదే సమయంలో భారత్ తో పాటు మరో ఏడు దేశాలు కూడా ఈ వివరాల్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐదు కళ్ల కూటమిగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు జపాన్, దక్షిణ కొరియా కూడా ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని ఆయా దేశాలు భారత్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

చైనా పీఎల్ 15ఈ క్షిపణిలో వాడిన డ్యూయల్-పల్స్ మోటార్ , AESA టెక్నాలజీని అధ్యయనం చేయడానికి ఏడు దేశాలు యాక్సెస్ కోరుతుండంతో ఈ శిథిలాల అన్వేషణ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇది చైనా అభివృద్ధి చెందుతున్న సైనిక సాంకేతికత గురించి ప్రపంచ దేశాల ఆందోళనకు ప్రతిబింబంగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం భారత రక్షణ శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇందులో లభించే ఫలితాలు మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి పనికొస్తాయని భావిస్తున్నారు. అలాగే ఏడు దేశాలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఈ క్షిపణి శిథిలాలు భారత్ కు దొరకడంపై చైనా రక్షణ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+