బల్లికి జన్మనిచ్చిన మహిళ! పబ్లిసిటీ కోసమని విమర్శ
జకర్తా: ఇండోనేషియాలో ఓ వింత జరిగింది. ఓ మహిళ బల్లికి జన్మనిచ్చింది! అయితే ఆమె మంత్రగత్తె అంటూ పలువురు మండిపడుతున్నారు. డెబీ అనే మహిళ గర్భవతి. ఆ విషయాన్ని గ్రామస్థులు కూడా నిర్ధారించారు. మే 30వ తేదీన ఆమెకు నొప్పులు వచ్చాయి.
ఆసుపత్రి చాలా దూరం కావడంతో ఇంటి పక్కనున్న మహిళ జోసెఫెన్ను కాన్పు కోసం సాయం కోరింది. ప్రసవం సమయంలో జోసెఫెన్.. డెబీ ఇంట్లోనే ఉంది. ఆమె కూడా చిన్నారి కాకుండా చిన్న బల్లి వచ్చిందని చెబుతోంది. ఏదో తేడా ఉందని గ్రహించిన జోసెఫెన్ ఆ బల్లి పిల్లను, తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లింది.
అయితే ఇదంతా బోగస్ అనీ, పబ్లిసిటీ స్టంట్ అని కూడా కొట్టి పారేసే వారు లేకపోలేదు. మరికొందరు మంత్రగత్తె అంటున్నారు. అయితే డెబీ వాదనను జోసెఫెన్ కూడా సమర్థిస్తోంది.
దీంతో డైలమాలో పడ్డ అదికారులు ఇది నిజమా కాదా తేల్చేందుకు ఓ దర్యాఫ్తు బృందాన్ని నియమించారు. అయితే ప్రసవం సమయంలో అక్కడే బల్లి ఉండవచ్చునని భావిస్తున్నారు. డెబీ చేతబడి చేస్తోందని, అందుకే ఇలా జరిగిందని గ్రామస్థులు మండిపడుతున్నారు.