కొవిడ్-19 వ్యాక్సిన్: చైనా అనూహ్యం -భారత్ సహకారం కోరిన జిన్పింగ్ -సాంప్రదాయ ఔషధాలతో..
కరోనా విలయానికి కర్త, కర్మ, క్రియగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. మహమ్మారిని అరికట్టే విషయంలో భారత్ సహకారాన్ని కోరింది. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీతోపాటు సాంప్రదాయ ఔషధాలతో వైరస్ ను తుదముట్టించగలిగే అవకాశాలను కలిసి పరిశోధిద్దామని పిలుపునిచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ మేరకు మంగళవారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేశారు. పింగ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తేగనుక దేశాల మధ్య భాగస్వామ్యంతో రూపొందనున్న తొలి వ్యాక్సిన్ తయారుకానుంది.
Recommended Video

జిన్ పింగ్ కీలక ప్రసంగం..
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి 12వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఐదు దేశాల అధినేతలు బొల్సనారో, పుతిన్, మోదీ, జిన్ పింగ్, సిరిల్ రమఫొసాలు తమ సందేశాలను వినిపించారు. కరోనా కారణంగా ఈ ఏడాది రష్యా ఆతిథ్యమిస్తోన్న సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత ఫార్మా దిగ్గజాలు ముందంజలో ఉన్నాయని మోదీ పేర్కొనగా, ఆ తర్వాత మాట్లాడిన జిన్ పింగ్ కీలక ప్రతిపాదనలతో ప్రసంగించారు..

భారత్ సహకారమే కీలకం..
‘కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే ప్రయత్నాల్లో భాగంగా చైనాకు చెందిన పలు కంపెనీలు.. రష్యా, బ్రెజిల్ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. అయితే దేశాధినేతలుగా మనం కూడా మరిన్ని ఉపశమన మార్గాలను అన్వేషించాలి. బ్రిక్స్ దేశాల సారధ్యంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి నేను ప్రతిపాదన చేస్తున్నాను. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సింఫోజియంను ఏర్పాటు చేయడం ద్వారా సంప్రదాయ ఔషధాలతో వైరస్ ను కట్టడిచేసే మార్గాలను అణ్వేషిస్తే మంచిదని ప్రతిపాదిస్తున్నాను. ఈ రెండు ప్రతిపాదనలకు భారత్ సహకారం ఎంతో కీలకమైనది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలన్నీ ఈ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను''అని జిన్ పింగ్ అన్నారు.

చైనా జాతీయ కేంద్రంలో రీసెర్చ్..
బ్రిక్స్ దేశాలన్నీ కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి అంగీకరిస్తే గనుక.. చైనాలోని జియామెన్ నగరంలోని ఆవిష్కరణ కేంద్రంలో సంబంధిత రీసెర్చ్ కోసం చైనా జాతీయ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని జిన్ పింగ్ చెప్పారు. విభేదాలను అధిగమించి, ఐక్యంగా పనిచేయడం ద్వారా వైరస్ ను ఓడించగలమని, తద్వారా బ్రిక్స్ దేశాలు ప్రపంచానికి కూడా దిక్సూచిగా పనిచేయాలని తాను కోరుతున్నట్లు జిన్ పింగ్ అన్నారు. బహుళవాదానికి మద్దతు, అమెరికా లాంటి దేశాల ఒత్తిడి ఒత్తిడికి లోను కాకుండా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు జిన్ పింన్ చెప్పారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications