మెమెన్ని ఉరితీసింది ఆ తలారే! కూతుర్ని కలవకుండా
ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్కు గురువారం ఉదయం నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. 257 మంది మృతికి ఇతడు కూడా కారణం. అయితే, మెమెన్ను ఉరి తీసింది అజ్మల్ కసబ్ను ముంబైలోని ఎరవాడ జైలులో ఉరి తీసిన తలారే.
అయితే, భద్రతా కారణాల వల్ల ఉరి తీసిన వ్యక్తి పేరు వెల్లడించలేదు. మెమెన్కు ఉరి కోసం పుణేలోని ఎరవాడ జైలు నుంచి 20 మంది సిబ్బంది వచ్చారు. అందులో అతను కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరొక కానిస్టేబుల్ కూడా వారం రోజుల క్రితం నాగపూర్ వచ్చారు. శిక్షణ ఇప్పించారు.

యాకూబ్ మెమెన్ చివరి కోరిక తీరలేదు. చనిపోయే ముందు తన కూతురు జుబేదియాను చూడాలని ఉందని మెమెన్ తన చివరి కోరికను జైలు అధికారులకు చెప్పాడు. జైలు వద్దకు అతడి కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే, అతని కూతురు మాత్రం రాలేదు.
వాస్తవానికి జైలు వద్దకు యాకూబ్ సోదరులు మాత్రమే వచ్చారు. అతడి కూతురు ముంబైలోనే ఉండిపోయింది. అనివార్య కారణాల వల్ల జుబేదియాను చూసే అవకాశం యాకుబ్ మెమెన్కు కలగలేదు. ఆమెతో ఫోనులో మాత్రం మాట్లాడే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications