IPL 2021:ఢిల్లీ పేసర్ అవేష్ ఖాన్ జెర్సీపై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్..ఎందుకో తెలుసా..?
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో పేసర్ ఆవేశ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్లాడిన ఆవేశ్.. ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్ జాబితాలో ఇపుడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆవేశ్ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చహర్ వికెట్లను అతడు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆవేశ్ ఖాన్కు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంటే విపరీతమైన అభిమానం. అందుకే మ్యాచ్ తర్వాత తన జెర్సీపై రోహిత్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆవేశ్ అభిమానానికి ఫిదా అయిన రోహిత్.. ముసిముసిగా నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ పుణ్యమాని వరల్డ్క్లాస్ ప్లేయర్స్తో ఆడే అవకాశం యువ ఆటగాళ్లకు దక్కుతోంది. తమ అభిమాన క్రికెటర్లతోనే కలిసి ఆడుతుండటాన్ని వాళ్లు తమ అదృష్టంగా భావిస్తున్నారు.
Fan boy moment for Avesh Khan, getting his Delhi Capitals jersey signed from Rohit Sharma. pic.twitter.com/uE4EGXsl36
— Johns. (@CricCrazyJohns) April 21, 2021
రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో అభిమానం అని మ్యాచ్ తర్వాత ఆవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. రోహిత్తో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్ చేయడం ఆనందం కలిగించిందన్నాడు. ఐపీఎల్ టోర్నీ ద్వారా ఎందరో గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నానని, వారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నానని ఆవేశ్ పేర్కొన్నాడు. ఢీల్లీ డ్రెసింగ్ రూమ్ ప్రశాంతంగా ఉంటుందని, సీనియర్ ఆటగాళ్లు సలహాలు ఇస్తున్నారన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడే అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రాంచైజీకి ఆవేశ్ ధన్యవాదాలు చెప్పాడు.

ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్ ధావన్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరలో ఢీల్లీ వికెట్లు కోల్పోయి ఉత్కంఠ రేపినా.. చివరికి నో బాల్ ద్వారా గెలిచింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications