నరేంద్ర మోదీ స్టేడియం పరువు గంగపాలు..
అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్లో గుజరాత్ టైటాన్స్ మెరుపులు మెరిపించింది. స్టేడియంలో పరుగుల వరద పారించింది. ఊహించినట్టే భారీ స్కోర్ను సాధించింది. ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు బ్యాటర్లు. ప్రత్యేకించి- ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అదరగొట్టాడు.
Richest cricket board and their technologies. 🤣🤣🤣👏👏👏👀👀👀👀🌧️⛈️🌦️
— Ajay Dhumal (@ajaydhumal5500) May 29, 2023
🙄🙄#CSKvsGT #IPL2023Finals #NarendraModistadium #IPLFinal2023 #rain #ChennaiSuperKings #IPLFinal2023 #CSKvGT #Dhoni pic.twitter.com/ra6FzL0fey
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ ఆరంభించింది. తన నిర్ణయం తప్పు అని తెలుసుకోవడానికి ధోనీకి ఎంతో సమయం పట్టలేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్ శుభారంభాన్ని ఇచ్చారు. ప్రారంభ ఓవర్లల్లో వారిద్దరూ ధాటిగా ఆడారు. చెన్నై బౌలర్లను దడదడలాడించారు.

వారిద్దరూ అవుట్ అయిన తరువాత కూడా గుజరాత్ ఇన్నింగ్ దూకుడుకు బ్రేకులు పడలేదు. నిర్ణీత 20 ఓవర్లల్లో 214 పరుగులు చేసిందా లోకల్ టీమ్. ఈ క్రమంలో నాలుగు వికెట్లను నష్టపోయింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ విజృంభించాడీ మ్యాచ్లో. తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. చివరి ఓవర్లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్- 39, వృద్ధిమాన్ సాహా- 54 చేశారు. కేప్టెన్ హార్దిక్ పాండ్యా- 21 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
#GujratModel 💥🔥#CSKvGT #IPL2023Final #swfc #GTvCSK #Succession #SuccessionFinale #Ahemdabad #NarendraModiStadium pic.twitter.com/hxO7c3Zeeq
— அருண்குமார் ம (@Arun_thought) May 29, 2023
215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కు వర్షం స్వాగతం పలికింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే క్రీజ్లోకి దిగిన కొద్దిసేపటికే వర్షం పడింది. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్ రెండు బంతులు డాట్స్గా పడ్డాయి. మూడో బంతిని రుతురాజ్ గైక్వాడ్ బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. దీనితో మ్యాచ్ను నిలిపివేశారు. పిచ్ను కవర్లతో కప్పివేశారు.
This is reality of the pathetic #NarendraModiStadium.#CSKvGT #GTvsCSK #IPL2023Final https://t.co/lTvd0zqAD8 pic.twitter.com/osGSbC2Ord
— Rebel With(out) a Cause (@ramchrisali) May 29, 2023
ప్రస్తుతం వర్షం నిలిచిపోయినప్పటికీ.. అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయం కావడం వల్ల దాన్ని ఆరబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు గ్రౌండ్ స్టాఫ్.ఇక డక్వర్త్ లూయిస్ సిస్టమ్ మీద చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఆధారపడింది. వర్షం వల్ల ఓవర్లను కుదించాల్సిన పరిస్థితి వస్తే- 18 ఓవర్లల్లో 198, 15 ఓవర్లల్లో- 171, 12 ఓవర్లల్లో 143, 10 ఓవర్లల్లో 123, ఎనిమిది ఓవర్లల్లో- 101, అయిదు ఓవర్లల్లో 66 పరుగులను చేయాల్సి ఉంటుంది ధోనీ సేనకు.
Pic 1 : ECB covering their ground with hover covers, covers a large portion and minimal manpower required to drag it.
— CRICKET____ LOVER👑💚💙 (@safiull59343406) May 29, 2023
Pic 2 : BCCI using sponges to soak water Please Note that BCCI is 728% richer than the ECB#CSKvsGT #NarendraModiStadium #IPL2023Finals pic.twitter.com/DqvRORBqsg
వర్షం ఆగిపోయినప్పటికీ.. అవుట్ పీల్డ్, పిచ్ను యుద్ధ ప్రాతిపదికన ఆరబెట్టడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వద్ద అందుబాటులో ఎలాంటి పరికరాలు లేవు. వర్షపు నీళ్లు నిలిచివున్న చోట స్పాంజ్తో బకెట్లలోకి తోడేయడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు గ్రౌండ్ స్టాఫ్. బురద ఉన్న ప్రదేశంతో పాటు, గుంతలు పడిన చోట పౌడర్తో కప్పివేస్తోన్నారు. దీనికోసం గ్రౌండ్ స్టాఫ్ చెమటోడ్చుతున్నారు.
ఈ పరిణామాలు అభిమానులను అసహనానికి, తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేస్తోన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించినట్టు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ జబ్బలు చరచుకొంటోన్నాయని, వర్షం పడిన నీరు తక్షణమే బయటికి వెళ్లేలా ఎలాంటి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని రాలేకపోయాయంటూ ధ్వజమెత్తుతున్నారు. దీనికంటే బెంగళూరులోని చిదంబరం స్టేడియం ఎంతో బెటర్ అంటూ చెబుతున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications