ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళం చెవి మాయంపై ఈసీ విచారణ: ప్రత్యేక అధికారి
కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూం తాళం చెవి మాయంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొండగట్టు జేఎన్టీయూలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరపనున్నారు. ఈ ఘటనకు సంబంధించి 2018లో పనిచేసిన ఎన్నికల అధికారులను కూడా విచారించనున్నారు.
విచారణకు రావాలని అప్పటి ఎన్నికల అధికారులకు ఈసీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. స్ట్రాంగ్ రూం తెరవాలని అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా సమక్షంలో తెరిచేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే స్ట్రాంగ్ రూంల తాళం చెవులు దొరకలేదు. మడు గదుళ్లో రెండో గది తాళం తెరచురుకోవడంతో అందులో పరిశీలించి వీడియో చిత్రీకరించారు. మిగితా రెండు గదుల తాళాలు దొరక్కపోవడంతో మరమ్మతులు చేసే వ్యక్తిని పిలిపించడం లేదా తాళం పగలగొట్టాలని భావించారు. ఇందుకు కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరిచిన గదితోపాటు మిగితా రెండు గదులకు అధికారులు సీల్ వేశారు.
కాగా, తెరుచుకున్న గదిలో 108 నుంచి 269 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. మిగితా రెండు గదుల తాళాలు తరచుకోలేదు. దీనిపై జిల్లా కలెక్టర్ కోర్టుకు నివేదించారు. స్పందించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించినట్లు సమాచారం.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications