ఆ నిధులు మీవే.. సర్కార్ జేబు నుంచి రావడం లేదు: ఈటల రాజేందర్
హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం మరింత హీటెక్కింది. నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. నిధుల గురించి బీజేపీ నేత ఈటల రాజేందర్ కామెంట్స్ చేశారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని వివరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారందరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇవన్ని సీఎం కేసీఆర్ ఇంటి నుంచి, ఆయన సొంత భూమి అమ్మి, కూలీ పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.
ఆ నిధులు మీవే
ప్రజలు
కట్టిన
పన్నుల
నుంచే
నిధులు,
పథకాలు
ఇస్తున్నారని
గుర్తుంచుకోవాలని
సూచించారు.
కేసీఆర్
కేవలం
కాపాలాదారుడు
మాత్రమే
అని
స్పష్టంచేశారు.
తనను
ఓడించడానికే
డబ్బులు
ఇస్తున్నారని,
ప్రజల
మీద
ప్రేమతో
కాదని
వివరించారు.
హుజూరాబాద్,
జమ్మికుంటలో
జెండా,
ఫ్లెక్సీ
కట్టడానికి
కూడా
పర్మిషన్
ఇవ్వడం
లేదని
ఈటల
రాజేందర్
ఆరోపించారు.
గెలుపెవరిదో..
హుజూరాబాద్
ఉప
ఎన్నికకు
కేంద్ర
ఎన్నికల
కమిషన్
మంగళవారం
షెడ్యూల్
విడుదల
చేసింది.
అక్టోబర్
1న
నోటిఫికేషన్
విడుదల
చేశారు.
అక్టోబర్
8వరకు
నామినేషన్
దాఖలుకు
చివరి
తేదీగా
నిర్ణయించారు.
అక్టోబర్
11న
నామినేషన్ల
పరిశీలిస్తారు.
నామినేషన్ల
ఉపసంహరణకు
చివరి
తేదీ
అక్టోబర్
13గా
ప్రకటించారు.
అక్టోబర్
30వ
తేదీన
ఎన్నికల
నిర్వహిస్తారు.
నవంబర్
2వ
తేదీ
ఓట్ల
లెక్కింపు
జరిపి
ఫలితాలను
ప్రకటిస్తారు.
తప్పనిసరి
హుజురాబాద్లో విజయం టీఆర్ఎస్- బీజేపీకి తప్పనిసరి. గెలుపు కోసం ఆ రెండు పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అధికార పార్టీకి విజయం కంపల్సరీ.. లేదంటే మొహం చూపించుకునే పరిస్థితి ఉండదు. ఇక బీజేపీ పరిస్థితి అయితే మరీ దారుణం.. పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. అభ్యర్థి ఈటల రాజేందర్కు మాత్రం జీవన్మరణ సమస్యే.. ఎందుకంటే ఆయన ఓడిపోతే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పు చెప్పనున్నారో చూడాల్సిందే.
Recommended Video
దళితబంధు
హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ.