మంత్రి ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్.. ఈ సారి రాజకీయాలు కాదు..
తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి రైతుల అంశంపై స్పందించారు. గత కొద్దీరోజులగా పార్టీలో కాస్త రెబల్ స్వరం వినిపించారు. ఆయనకు ఫస్ట్ టర్మ్లో ఆర్థికశాఖ ఉండగా.. ఈ సారి అదీ వైద్యారోగ్యశాఖగా మారింది. సీఎం కేసీఆర్ తాను కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఉద్యమం నుంచి దోస్తులమని చెబుతున్నారు. అయితే ఓ వైపు పార్టీ, ప్రభుత్వంలో ఉంటూనే కాస్త విమర్శలు చేశారు.
మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు ధాన్యం కొంటారో కొనరో అనే భయం రైతుల్లో నెలకొందని కామెంట్ చేశారు. రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనే స్తోమత వ్యాపారి దగ్గర లేదని చెప్పారు. అయితే ఐకేపీ సెంటర్లో వడ్లు కొంటేనే మహిళలకు ఉపాధి దొరుకుతుందని ఈటల రాజేందర్ చెప్పారు. రైతులకు ఇప్పుడిప్పుడే నాలుగు మెతుకులు అందుతున్నాయని తెలిపారు. రైతుల పంటకు ఎమ్మెస్పీ ప్రకారం కొనాల్సిందేనని ఈటల స్పష్టం చేశారు.
ఈటల రాజేందర్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. బాధ్యతాయుతమైన మంత్రి పదవీలో ఉండి ఇలా కామెంట్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై అధికార పార్టీ స్పందించలేదు. విపక్ష నేతలు మాత్రం ఒంటికాలిపై లేస్తున్నారు. కానీ ఈటల చెప్పింది సత్యం అని.. అతని అభిప్రాయాన్ని ఖండించాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. ఈటల ఈ కామెంట్స్ ఏ దుమారం రేపుతుందో చూడాలీ మరీ.