వెంకటేశ్వరుడి చెంత చేరింది గరుడ పక్షి కాదట.. మరేంటో తెలుసా?
కోరుట్ల : జగిత్యాల జిల్లా కోరుట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశుడి వాహనమైన గరుడపక్షి స్వామివారి పాదాల చెంతకు చేరిందనే వార్త వైరల్ కావడంతో పెద్దసంఖ్యలో గుమిగూడారు. గంటల వ్యవధిలోనే ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాదాపు అన్ని టీవి ఛానళ్లలో గరుడపక్షి అని బ్రేకింగులు నడిపారు. దీంతో దేవుడి మహిమని కొందరు.. కాదు కాదు అది గుడ్లగూబని మరికొందరు కామెంట్లు చేశారు. చివరకు అది గరుడపక్షి కాదనే కోణం బయటపడింది.

రీసెర్చ్ స్కాలర్ ఒకరు అది గరుడపక్షి కాదని గుడ్లగూబ సంతతకి చెందిన బర్న్ అవుల్ (Barn Owl) అని తేల్చారు. జాతీయ స్థాయి మీడియాకు ఈ విషయం వెల్లడించారు. అది సాధారణంగా మధ్నాహ్నం సమయంలో డల్ గా ఉంటుందని, ఎక్కువగా కదల్లేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. అందుకే ఆలయంలో అలా ఎటూ మెదలక ఉండిపోయిందని చెప్పారు. రాత్రి సమయాల్లో మాత్రమే అది యాక్టివ్ గా ఉంటుందని వివరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications