Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌కు భయం పట్టుకుంది, అభద్రతా భావంతో ఇలా: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హీటెక్కింది. నిన్న కేసీఆర్ సభ.. ఇవాళ మునుగోడులో అమిత్ షా సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కమలనాథులపై కేసీఆర్ కస్సు బుస్సుమన్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ చేసిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని స్పష్టంచేశారు.

సీఎం కేసీఆర్ అడిగిన మునుగోడులోనే సమాధానాలు చెబుతామని ఆయన వివరంచారు. అంతేకాదు కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామని కూడా తెలిపారు. ఆయన గురించి జనాలకు తెలియజేస్తామని వివరించారు. కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని గుర్తుచేశారు. సభలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియరాలేదని చెప్పారు.

Cm kcr is feared about bjp:bandi Sanjay

ఇవాళ మునుగోడులో అమిత్ షా భారీ బహిరంగ సభ జరగనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. ఇవాళ చాలా మంది నేతలు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఏయే నేతలు చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని.. బండి సంజయ్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఎంతమంది చేరతారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. బీజేపీ కూడా మెల్లిగా తమ పార్టీని విస్తరించాలని అనుకుంటుంది. అందులో భాగంగానే తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఇవాళ రాత్రి షాతో జూనియర్ ఎన్టీఆర్టీ భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరూ కలిసి.. ఏయే అంశాలపై మాట్లాడతారనే ఇష్యూ.. పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు దారితీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+