TRAI News: మెుబైల్ కస్టమర్లకు గుడ్న్యూస్.. మే 1 నుంచి ఫేక్ కాల్స్, SMSల నుంచి విముక్తి..
TRAI News: నానాటికీ మెుబైల్ ఫోన్ల వినియోగం దేశంలో పెరిగిపోతూ వస్తోంది. అయితే వినియోగదారులను బాగా ఇబ్బంది పెడుతున్న విషయాల్లో ఒకటి అనవసరమైన కాల్స్, మేసెజ్లు.
వినియోగదారుల ఇబ్బందులను తొలగించే క్రమంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కాలింగ్ నిబంధనల్లో మార్పులను తీసుకొచ్చింది. ఇవి మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన టెక్నాలజీని ఇప్పటికే సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది.

నకిలీ కాల్స్, ఎస్ఎమ్ఎస్ లను నిరోధించేందుకు ఎయిర్టెల్ ఏఐ ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గతంలో తెలిపింది. దేశంలో అతిపెద్ద ఆపరేటర్ గా ఉన్న రిలయన్స్ జియో సైతం AI ఫిల్టర్లను సెటప్ చేసే ప్రణాళికతో ముందుకొస్తోంది. ఇదే సమయంలో బోగస్ కాల్స్ నిరోధించేందుకు చర్యల్లో భాగంగా టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్.. 10 అంకెల మెుబైల్ నంబర్లను ప్రమోషన్, బిజినెస్ అవసరాలకు వినియోగించకుండా బ్లాక్ చేయాలని కోరింది.
రానున్న కాలంలో ట్రూకాలర్ మాదిరిగా కాలర్ పేరు, వారికి సంబంధించిన ఫోటోను చూపే కాలర్ ఐడీ విధానాన్ని టెలికాం రెగ్యులేటర్ ప్రవేశపెట్టింది. ఈ విషయంలో Truecaller యాప్ Airtel, Jioతో కూడా చర్చలు జరుపుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications