32. 36.. వేర్వేరు చోట్ల విద్యార్థులకు కరోనా వైరస్..
కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు టీకా తీసుకుంటోన్న ఇటు.. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో విద్యాసంస్థలో కరోనా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా టేక్రియాల్ లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 32 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్టు వెల్లడైంది. అయితే వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్ వచ్చినా, వారిలో ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.
భారత్లో కరోనా విలయం -ఒక్కరోజే 131 మంది మృతి -కొత్తగా 24,492 కేసులు
ఆ బాలికలను హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఇదే పాఠశాలలో ఆరుగురు టీచర్లు కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు హైదరాబాద్ నాగోల్లో గల తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 36 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇదీ మరింత ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన విద్యార్థినులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ కేసులు మాత్రం పెరగడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులకు సూచిస్తూనే ఉన్నారు.