ఏపిలో కలకలం: ఇంటర్ విద్యార్ధిని పై 9మంది అత్యాచారం : మభ్య పెట్టి..మందు తాగించి..
ఇంటర్ విద్యార్ధిని పై గ్యాంగ్ రేప్. మృగాళ్ల పైచాశికం. ఏపిలో కలకలం .మానవత్వానికే మచ్చగా నిలిచే ఉదంతం. ఇంటర్ విద్యార్ధిని పై తోటి విద్యార్ధులే అత్యాచారినికి పాల్పడిన ఘటన. ఏకంగా ఆ విద్యార్ధిని పై తొమ్మది మంది అత్చాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. పోలీసులకు కుంటుంబ సభ్యుల ఫిర్యాదు. దీని పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఆ విద్యా ర్ధినిని ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.
ఏపిలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై తోటి విద్యార్థుల అత్యాచా రానికి పాల్పడ్డారు. విద్యార్థినిని ప్రలోభ పెట్టి తొమ్మిది మంది యువకులు అత్యాచారం చేశారు. పట్టణంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక ఓ ప్రవేటు జూనియర్ కళాశాలతో ఇంటర్ చదువుతోంది. అమెకు కొంత మానసిక సమస్య ఉంది. దీనిని ఓ మాజీ మిలిటరీ ఉద్యోగి అలుసుగా తీసుకున్నాడు. మాయ మాటలతో ఆ విద్యార్ధినికి మద్యం అలవాటు చేసాడు.
పుట్టిన రోజు పార్టీకి రావాలంటూ వారం క్రితం తన ఇంటికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ విద్యార్ధిని మద్యం మత్తులో ఉన్న సమయంలో అతడితో పాటుగా 8 మంది ఆ విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుండి ఆ విద్యార్ధిని ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటోంది. అనుమానం వచ్చిన పేరెంట్స్ ప్రశ్నించటం తో అసలు వషయం బయటపడింది. దీని పై వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
మానసిక పరిస్థితి..సహచర విద్యార్ధి సైతం
ఇంటర్ చదువుతున్న ఆ విద్యార్ధిని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటంతో దీనినే వారు అలుసుగా తీసుకున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. తమ విచారణలో అత్యాచారం జరిగినట్లుగా తేలిందని..ఆ తొమ్మది మందిలో విద్యార్ధి సహ చర విద్యార్ది సైతం ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరంతా విద్యార్ధిని కి మాయ మాటలు చెప్పి కొంత కాలంగా మద్యానికి అలవాటు చేసి..సమయం చూసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఈ ఘటన పై విచార ణ ప్రారంభించిన పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన వారి కోసం వేట ప్రారంభిం చారు. దీనిని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటన పై కుటుంబ సభ్యులతో పాటుగా మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.