సముద్రుడి ఉగ్రరూపానికి బలి: కళింగపట్నంలో చొచ్చుకొచ్చిన అలలు!
Recommended Video
శ్రీకాకుళం: పొరుగున ఒడిశాతో పాటు శ్రీకాకుళం జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏడతెరిపి కూడా ఇవ్వకుండా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల జిల్లాకు గుండెకాయగా చెప్పుకొనే వంశధార నదీ వరదపోటుకు గురైంది. అయిదేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంత వరద ప్రవాహంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. సాధారణ ప్రవాహానికి తోడు వరదపోటు తోడు కావడంతో ఉరకలెత్తుతోంది. గొట్టా బ్యారేజీ నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటితో దిగువకు వదిలారు అధికారులు. ఈ నీరంతా దిగువకు ప్రవహిస్తూ, సముద్రంలో కలుస్తోంది వరద నీరు.
దీనికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తోడైంది. ఫలితంగా- కళింగపట్నం సమీపంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు చొచ్చుకుని వచ్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలో మనోల్లాసం కోసం ఏర్పాటు చేసిన అటవీ జంతువుల బొమ్మలు ధ్వంసం అయ్యాయి. కళింగపట్నం సముద్రతీరంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన జిరాఫీ, ఏనుగు, ఒంటె బొమ్మలు విరిగిపోయాయి. కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంలో ఒడిశాలోని కేంద్రపారా సమీపంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఇంకా కొనసాగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని చేపల వేటను నిషేధించారు జిల్లా అధికారులు. కళింగ పట్నం పోర్టు వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వంశధార నది వరద ప్రభావానికి గురైన నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా పాలనా యంత్రాంగం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. గొట్టా బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు

అధికారులు. క్రమంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వంశధారకు వరద పోటెత్తుతోంది. నాగావళిపై నిర్మించిన తోటపల్లి రిజర్వాయర్ నుంచి 16, 648 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications