200 రూపాయల కోసం క్యాబ్ డ్రైవర్ పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు: అసలేం జరిగిందంటే
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రెండు వందల రూపాయల కోసం ఒక క్యాబ్ డ్రైవర్ పై అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన, ఆ డ్రైవర్ కోమాలో ఉండడంతో వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

క్యాబ్ డ్రైవర్ తో 200 రూపాయల విషయంలో యువకుడు వాగ్దాదం
నారాయణఖేడ్ కు చెందిన 27 సంవత్సరాల వెంకటేష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జూలై 31వ తేదీన రాత్రి సమయంలో వివేక్ రెడ్డి అనే యువకుడు బి.యన్.రెడ్డి నుండి ఉప్పర పల్లి వెళ్లడానికి వెంకటేష్ కు సంబంధించిన క్యాబ్ బుక్ చేసుకున్నాడు. దీంతో అతడిని ఎక్కించుకునేందుకు వెళ్ళిన వెంకటేష్ మార్గ మధ్యలో తన కారు యజమాని ని ఎక్కించుకొని, వివేక్ ను ఎక్కించుకున్నాడు. ఇక వివేక్ ను ఉప్పరపల్లి లో డ్రాప్ చేసిన తర్వాత డబ్బుల విషయంలో వివేక్ వెంకటేష్ మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఆరు వందల రూపాయల బిల్లు అయితే, వివేక్ రెండు వందల రూపాయలు తక్కువగా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగింది.

20 మంది స్నేహితులతో క్యాబ్ డ్రైవర్ పై దాడి .. ఆపై బాదితులపైనే ఫిర్యాదు
ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలుచుకున్నాడు. మొత్తం 20 మంది క్యాబ్ డ్రైవర్ పైనా, కారు యజమాని పైన విచక్షణారహితంగా క్రికెట్ బ్యాట్ లు, వికెట్లతో దాడికి పాల్పడ్డారు. తమకు డబ్బులు వద్దు వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా దాడిచేసి, చివరకు దాడి చేసినవారు బాధితుల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలించకుండా బాధితులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ క్రమంలో వెంకటేష్ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

50 లక్షలు ఖర్చు పెట్టినా కోమా నుండి బయటకు రాని క్యాబ్ డ్రైవర్
ఇక ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంకటేశ్ ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అతను తిరిగి మామూలు స్థితికి రాలేదు. వెంకటేష్ తల్లిదండ్రులు తమకు ఉన్న పొలాన్ని అమ్మి మరీ కొడుకు వైద్యం కోసం ఖర్చు పెట్టారు. తన కొడుకుని ఆదుకోవాలని తల్లిదండ్రులు దీనంగా రోదిస్తున్నారు. వెంకటేష్ కోమాలోకి వెళ్లడంతో పోలీసులు వివేక్ పై కేసు నమోదు చేశారు.

ఆవేశమే ఈ అనర్ధానికి కారణం ..
వివేక్ కోర్టులో లొంగిపోగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేవలం రెండు వందల రూపాయల కోసం ఒక వ్యక్తిని 20 మంది కలిసి క్యాబ్ డ్రైవర్ ను చితకబాది, అతడు తిరిగి లేవలేని స్థితికి తీసుకు రావడంతో పాటు, వారు కూడా అనవసరంగా కేసులో ఇరుక్కున్నారు. అందుకే ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇంత పెద్ద అర్థానికే వారి ఆవేశమే కారణమైంది. ఒక క్యాబ్ డ్రైవర్ జీవితాన్ని నాశనం చేసింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications