అమెరికాలో తెలంగాణ యువకుడు ఎం. వంశీరెడ్డి ఆత్మహత్య
అమెరికాలో తెలంగాణకు చెందిన ముద్దసాని రాజా వంశీరెడ్డి ఆత్మహత్య చేసుకొన్నారు.మిచిగాన్ యూనివర్శిటీలో వంశీరెడ్డి చదువుతున్నాడు.వంశీరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video

హైదరాబాద్: తెలంగాణకు చెందిన 23 ఏళ్ళ ముద్దసాని రాజా వంశీరెడ్డి మిచిగాన్ యూనివర్శిటీలో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఈ ఏడాది వేసవికాలంలోనే ఫ్లోరిడా నుండి మిచిగాన్కు వంశీరెడ్డి వచ్చారు.వంశీరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై మిచిగాన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ వంశీరెడ్డి బౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ మేరకు ఆన్లైన్లో విరాళాలు సేకరిస్తున్నారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్.
వంశీరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.మంగళవారం నాడు వంశీరెడ్డి కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని మిచిగాన్ పోలీసులు చేరవేశారు.
వంశీరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామాన్ని తరలించేందుకు గాను 50వేల డాలర్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. అయితే 12 గంటల్లోనే 350 మంది సుమారు 13వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు. సోషల్ మీడియా కేంద్రంగా క్యాంపెయిన్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications