ఎయిర్పోర్టులో నోట్ల కట్టలు సీజ్.. మూడేళ్లలో అదే పెద్ద మొత్తం
హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్దీ బంగారం శంషాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడుతోంది. విదేశాల నుంచి వచ్చే వారు తమ వెంట అడ్డదారిలో బంగారం తీసుకొస్తూ కస్టమ్ అధికారుల కంటికి చిక్కుతున్నారు. ఆ క్రమంలో భారీగా నగదు పట్టుబడుతుండటం గమనార్హం. తాజాగా హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న థామస్ అనే వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయల నగదు దొరకడం చర్చానీయాంశమైంది.
సీఐఎస్ఎఫ్ అధికారుల తనిఖీల్లో థామస్ బండారం బయటపడింది. ఇదంతా అక్రమ నగదుగా తేల్చారు అధికారులు. సరైన పత్రాలు లేకుండా ఇంత పెద్దమొత్తంలో తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఈ స్థాయిలో భారీగా నగదు దొరకడం ఇటీవల ఇదే మొదటిసారి. థామస్ నుంచి 3 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.

గతంలో చాలాసార్లు కోటికి పైగా నగదు పట్టుబడిన సందర్భాలున్నాయి. 2016, అక్టోబరులో మాత్రం దాదాపు 14 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మూడేళ్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం ఇదే మొదటిసారి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications