21 రోజుల్లో 31 మంది మరణం.. ఎక్కడ, ఎందుకంటే..?
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో మూడు వారాలుగా కొనసాగిన 'ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్' ముగిసిందని ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, సీఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆపరేషన్.. మే 11న ముగిసిందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు, హిద్మా వంటి అగ్రశ్రేణి మావోయిస్టులను పట్టుకోవడమే టార్గెట్ గా ఈ ఆపరేషన్ కొనసాగిందని స్పష్టం చేశారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), కోబ్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్... బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ కు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని కర్రెగుట్టలను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్ను చేపట్టాయి. మూడు వారాల్లో 28 సార్లు ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు.

21 రోజుల్లో 31 మంది మృతి..
అలానే ఈ ఎన్కౌంటర్లలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా.. 18 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని స్పష్టం చేశారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బీజాపుర్లో జరిగిన మీడియా సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. అంతే కాకుండా ఆపరేషన్లో ఇప్పటివరకు 20 మృతులను గుర్తించినట్లు పేర్కొన్నారు.
450 మందుపాతరలు..
వెయ్యి మీటర్ల వైరు, 450 మందుపాతరలు, 35 హై పవర్డ్ ఆయుధాలు - SLR, ఇన్సాస్, బీజీఎల్ లాంచర్లు, షాట్ గన్స్ - స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా 15 మందుపాతరలను నిర్వీర్యం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బీజాపుర్ నేషనల్ పార్క్ పరిధిలోని మాద్ ప్రాంతం, నారాయణ్పుర్లో భద్రతా బలగాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ విజయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. వామపక్ష తీవ్రవాద నిర్మూలన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయని పేర్కొన్నారు. శాంతి నెలకొల్పడం, అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ ద్వారా వెల్లడించారు. అలానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దేశ వ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనలో ఇది చారిత్రాత్మక పురోగతి అని అభివర్ణించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామన్నారు.
మరోవైపు ఇక మావోయిస్టు పార్టీ తరఫున కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. తమ పార్టీ ఎప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందన్నారు. కేంద్రం కూడా చర్చలకు సిద్ధంగా ఉందా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్చలే మార్గమని అభయ్ పేర్కొంటూ, ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు, అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ అంశంపై స్పందించాలని కోరారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications