Viral Video: హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బంది పట్ల దౌర్జన్యం..!!
హైదరాబాద్: విమానాల్లో తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించే సందర్భాలు ఈ మధ్యకాలంలో మితిమీరిపోతున్నాయి. ఎయిరిండియా విమానంలో ముంబైకి చెందిన శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనను- డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.
ఇద్దరు పైలెట్ల లైసెన్సులను మూడు నెలల పాటు రద్దు చేసింది. ఎయిరిండియా యాజమాన్యంపై 30 లక్షల రూపాయాల జరిమానా విధించింది. అటు ఎయిరిండియా కూడా మూత్రం పోసిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న శంకర్ మిశ్రాపై చర్యలు తీసుకుంది. నాలుగు నెలల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధాన్ని విధించింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ కూడా చేశారు.
#WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today
— ANI (@ANI) January 23, 2023
The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV
ఇప్పుడు తాజాగా- స్పైస్ జెట్ విమానంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహిళా సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడో ప్రయాణికుడు. దౌర్జన్యం చేశాడు. మహిళా సిబ్బందితో ఆ ప్రయాణికుడు గట్టిగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ యాజమాన్యం ధృవీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొంది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరాల్సిన ఎస్జీ-8133 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందితో గట్టిగా మాట్లాడటం ఈ వీడియోలో రికార్డయింది. ఆ ప్రయాణికుడిని వారించడానికి మరో ఇద్దరు సిబ్బంది రావడం, అతణ్ని శాంతింపజేయడం కనిపించింది.

అనంతరం సిబ్బంది ఆ ప్రయాణికుడితో పాటు అతని వెంట ఉన్న మరొకరిని విమానం నుంచి విమానం నుంచి కిందికి దించేశారు. ఆ ఇద్దరినీ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులకు అప్పగించారు. ఈ గొడవ చోటు చేసుకోవడానికి గల కారణాల గురించి స్పెస్ జెట్ యాజమాన్యం వెల్లడించలేదు. దీనికి గురించి ఆరా తీస్తోన్నామని తెలిపింది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications