సెల్ పోయిందని సిల్లీ రీజన్ కే సూసైడ్ చేసుకున్న యువకుడు
చనిపోవడానికి బలమైన కారణాలు కూడా అవసరం లేకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్న యువత అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.
తాజాగా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను అన్న ఒకే ఒక్క కారణంతో ఓ యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని ఆలోచించేలా చేస్తోంది.

కామారెడ్డి జిల్లా ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన లో అశోక్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు తాను ఇష్టంగా కొనుక్కున్న సెల్ ఫోన్ పోయిందని మనస్థాపానికి గురై చెయ్యి కోసుకున్నాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే అశోక్ కుమార్ తల్లి జయమ్మ చేయి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయిన కుమారుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించింది.
అశోక్ కుమార్ కోలుకోవటంతో ఇంటికి తీసుకు వచ్చిన తల్లి పని మీద బయటకు వెళ్లడంతో మరోమారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అశోక్.
ఈ సారి ఏకంగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం సెల్ ఫోన్ పోయింది అన్న ఒక కారణం తోనే మనస్థాపానికి గురైన అశోక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications