మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..
ఆసిఫాబాద్ అడవుల్లో మళ్లీ మావోయిస్టుల అలజడి చోటుచేసుకోవడం.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్.. ఇటీవల తన దళంతో కలిసి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరించాడని పోలీసులు ప్రకటించడం.. అంతలోనే మావోయిస్టు అగ్రనేతలు గణపతి, వేణుగోపాల్ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం.. లాంటి కీలక పరిణామాల నడుమ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పర్యటించడం సంచలనంగా మారింది. గడిచిన నెల రోజులుగా జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి..

డీజీపీ ఏరియల్ సర్వే..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత పరివాహకంలోని ఏజెన్సీ ప్రాంతాలనూ ఆయన పరిశీలించారు. అంతకుముందు, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న పోలీస్ బాస్ కు ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్కుమార్ ఝా, జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, రామగుండం సీపీ సత్యనారాయణ స్వాగతం పలికారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో డీజీపీ ఆసిఫాబాద్ ఏజెన్సీకి రావడం ఇది రెండోసారి. కాగా..

పేర్ల వెల్లడిపై స్థానికుల లొల్లి..
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్, స్థానిక కేడర్తో కలిసి తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జూలై 15న మంగి ఆడవుల్లో పోలీసులకు, మావో యిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయని, మావోయిస్టులు జారవిడుచుకున్న వస్తువుల్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటిలో మావోయస్టులకు సహకరిస్తోన్న వ్యక్తుల సమాచారం ఉందంటూ సంబంధిత వివరాలను జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ శనివారం(ఆగస్టు 30న) మీడియాకు తెలిపారు. కాగా, దర్యాప్తునకు ముందే పేర్లను బయటికి ప్రకటించడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఎస్పీ చెప్పిన జాబితా ఇదే..
భాస్కర్ దళంతో ఎదురుకాల్పుల సమయంలో లభించిన డైరీలోని వివరాలను బట్టి మత్తడిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగదేవ్, సల్గుపల్లికి చెందిన సోయం చిన్నయ్య, రోంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, చాల్బడికి చెందిన గోవింద్రావు, పార్వతిగూడకు చెందిన హన్మం తురావు, చోర్పల్లికి చెందిన జగ్గరావు తదితరులతో పాటు తుడుందెబ్బకు చెందిన మహేష్, డీటీఎఫ్కు చెందిన రమేష్, ఆదివాసీ విద్యార్థి సంఘానికి చెందిన వివేక్, దీపక్ తదితరులకు మావోయిస్టు నాయకుడు భాస్కర్తో సంబంధాలు నెరుపుతున్నట్లు తేలిందని ఇన్చార్జి ఎస్పీ వారియర్ మీడియాకు చెప్పారు. ఎదురు కాల్పుల ఘటన సమయంలో ఒక సారి, అనుమానితుల పేర్లు వెల్లడైన సందర్భంలో రెండోసారి రాష్ట్ర డీజీపీ ఆసిఫాబాద్ అడవుల్లో పర్యటించడం గమనార్హం. ఆయన పర్యటన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications