ఇక్కడ గెలిస్తేనే: కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్లారో చెప్పిన అమిత్ షా!
Recommended Video

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి 11 మంది కోట్ల సభ్యులు ఉన్నారని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం అన్నారు. అమిత్ షా బుధవారం హైదరాబాదులో అడుగు పెట్టారు. పలువురు నేతలతో భేటీ అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన సమరభేరీలో మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలన్నారు.

ఏపీ, తెలంగాణలలో గెలిస్తేనే సంపూర్ణ విజయం
బీజేపీకి 15 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారని అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో గెలిస్తేనే పార్టీకి సంపూర్ణ విజయం దక్కినట్లు అని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీల కోసమే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.బీజేపీ దేశం కోసం పని చేస్తోందని, కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తోందని చెప్పారు.

కొడుకును సీఎం చేసేందుకే
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తే బీసీ, దళితులకు అన్యాయం జరుగుతుందని అమిత్ షా అన్నారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రిని చేసేందుకే అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించారు. తన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, తన కూతురు కల్వకుంట్ల కవితలలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేసేందుకు ముందస్తు ఎన్నికలను తీసుకు వచ్చారని చెప్పారు.
119 నియోజకవర్గాల్లో ఒంటరి పోరు
తాము 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు అమిత్ షా చెప్పారు. మార్పు బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ భయంతోనే కేసీఆర్ ముందస్తును తెచ్చారని చెప్పారు. లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ సత్తా చాటుతుందని కేసీఆర్ భయపడ్డారన్నారు.
అగ్రసేన్ మహారాజుకు నివాళి
కాగా, అంతకుముందు అమిత్ షా బంజారాహిల్స్లోని తెలంగాణ రాష్ట్ర సమితి భవన్కు, జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ అగ్రసేన్ మహారాజు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అగ్రసేన్ మహారాజు జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications