బర్డ్ ఫ్లూ ఆందోళన.. తెలంగాణా ప్రభుత్వ కీలక నిర్ణయం.. చికెన్ తినొచ్చా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణాలో బర్డ్ ఫ్లూ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెప్తున్నారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ఏపీ నుండి వచ్చే కోళ్ళ వాహనాలు వెనక్కు
ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతుంది. ఈ నెల 7తారీకు నుండి రాష్ట్ర బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బర్డ్ ఫ్లూ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తించకుండ చర్యలు తీసుకుంటున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు కోళ్ళ ఫారాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తున్నారు.

తెలంగాణాలో బర్డ్ ఫ్లూ.. తాజా పరిస్థితి ఇదే
దాణా తెచ్చే వాహనాలు సైతం శానిటైజ్ చేసి కోళ్ళ ఫారాలకు అనుమతించాలని, శానిటైజ్ చెయ్యకుంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి వెల్లడించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఇతర కారణాలతో కోళ్లు మరణించినట్టు ఆయన పేర్కొన్నారు.
చికెన్ తినొచ్చా? అధికారులు చెప్తుందిదే
తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో చికెన్ తినకూడదని తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు.వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతి పైన రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామని, అవి ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందని ఆయన అన్నారు బర్డ్ ఫ్లూ పై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు.
చికెన్ తింటే అలాగే తినాలి
కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్తోకే అవకాశం చాలా తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.. బాగా చికెన్ ఉడికించి తినడం వల్ల వైరస్ బతికే ఛాన్స్ ఉంటదని ఎట్లాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications