తెలంగాణలో ఎన్డీఏ కూటమి, పొత్తుల పై తేల్చేసిన బీజేపీ..!!
తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి. కొత్త పొత్తులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమీకరణాలను మార్చేస్తున్నాయి. దీంతో, రానున్న గ్రేటర్ తో సహా అన్ని ఎన్నికల్లో కొత్త పొత్తులు ఖాయమనే చర్చ మొదలైంది. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ తరహాలో ఎన్డీఏ పొత్తు ఉంటుందని కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ పొత్తుల చర్చ వేళ బీజేపీ చీఫ్ తమ విధానం స్పష్టం చేసారు. పొత్తుల లెక్కల పై క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. రాబోయే జీహెంఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ఆ వైఫల్యాలను సమీక్షించుకుని లోపాలను సవరించుకున్నామని వెల్లడించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధభయంతో భయపడు తుంటే..దేశ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వంలో ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారని రాంచందర్ రావు అన్నారు. లాక్డౌన్ విధించే అవకాశమే లేదని తెలిపారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు. సీఎం మొదటగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు.

తెలంగాణలో ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు
అదే విధంగా హైడ్రా పేరుతో ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని, అధికారం లో కి వచ్చాక కూల్చివేతలే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి, డొక్కు బస్సులను నడపడం వల్ల ఆర్టీసీ వ్యవస్థ కుప్పకూ లింద ని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో గ్యాస్ కొరత సృష్టించడం వెనక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందని రాంచందర్రావు ఆరోపించారు. ఖానాపూర్ మున్సిపాలిటీ లో బీజేపీ సాధించిన విజయం ప్రత్యేకమైనదని రాంచందర్రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కమలం వికసించిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎత్తుగడలను చిత్తుచేస్తూ ఖానాపూర్ మున్సిపాలిటీపై కాషాయజెండా ఎగురవేయడం చరిత్రాత్మక విజయమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభివర్ణించారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
-
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..













Click it and Unblock the Notifications