బీఫ్ తినేవారు బిజెపికి ఓటు వేయక్కర్లేదు: అసదుద్దీన్కు రాజాసింగ్ కౌంటర్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆవు, ఎద్దు మాంసం తినేవారు బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు.
అసదుద్దీన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గోవధను బీజేపీ వంద శాతం అడ్డుకుంటుందని, బీఫ్ గురించే మాట్లాడితే తాము ఊరుకోమని హెచ్చరించారు.

బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ... గోహత్యకు తాము వ్యతిరేకమని, ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కమ్యూనల్ హైదరాబాద్గా మార్చే ప్రయత్నం ఒవైసీ చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ నిషేధిత అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ టీడీపీ
నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని టీడీపీ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుర్తు పైన గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తిరిగి పోటీ చేయాలన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications