వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఫ్ తినేవారు బిజెపికి ఓటు వేయక్కర్లేదు: అసదుద్దీన్‌కు రాజాసింగ్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ వెంటనే గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆవు, ఎద్దు మాంసం తినేవారు బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు.

అసదుద్దీన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గోవధను బీజేపీ వంద శాతం అడ్డుకుంటుందని, బీఫ్ గురించే మాట్లాడితే తాము ఊరుకోమని హెచ్చరించారు.

 BJP MLA Raja Singh counter to beef comments

బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ... గోహత్యకు తాము వ్యతిరేకమని, ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కమ్యూనల్ హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం ఒవైసీ చేస్తున్నారని ఆరోపించారు. బీఫ్ నిషేధిత అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందన్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ టీడీపీ
నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని టీడీపీ కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుర్తు పైన గెలిచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తిరిగి పోటీ చేయాలన్నారు.

English summary
BJP MLA Raja Singh counter to beef comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X