రియల్టర్ కూతురితో ప్రేమ: చంపేసి శవాన్ని నాపరాయి గనిలో పూడ్చేశారు
తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు.
తాండూరు: తాండూరులో పరువు హత్య జరిగింది. తన కూతుర్ని ప్రేమించిన పేదింటి యువకుడిని ఓ రియల్టర్ పథకం ప్రకారం కిరాయి హంతకులతో చంపించాడు. శవాన్ని నాపరాళ్ల గని గుంతలో పాతేపించాడు. నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం ఆదివారం కనిపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయిపూర్కు చెందిన బెస్త యాదప్ప(21), అదే ప్రాంతానికి చెంది న ఓ ధనికుడైన రియల్టర్ వ్యాపారి కూతుర్ని ఆరేళ్ళుగా ప్రేమిస్తున్నాడు. దీంతో యాదప్పను రియల్టర్ బెదిరించాడు. ఈ వ్యవహారం పంచాయితీ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

ఎంత చెప్పినా తన కూతుర్ని మరిచిపోవడం లేదని యాదప్పను హత్య చేసేందుకు కిరాయి హంతకులతో రియల్టర్ ఒప్పందం చేసుకున్నాడు. తన వద్ద పని చేస్తున్న డ్రైవర్ను తొలగించినట్లు నాటకమాడి యాదప్పతో స్నేహం చేయించాడు. పథకం ప్రకారం ఈ నెల 20న యాదప్పను వాహనంలో బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గని వద్దకు రప్పించాడు. అక్కడ యాదప్ప గొంతు నులిమి హత్య చేశారు.
అతడి మృతదేహాన్ని నాపరాయి గనుల వద్దకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టారు. కాగా, తన కుమారుడు కనిపించడం లేదని యాదప్ప తల్లి నర్సమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, యువకుడిని హత్య చేసిన రోజే భయాందోళనకు గురైన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications