బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు: ఈడీ
హైదరాబాద్: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ. 39 కోట్లు నష్టం చేకూర్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
సంతోశ్ శ్యాండ్, సంతోశ్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది. మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ మహిపాల్రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాలు చేశారు ఈడీ అధికారులు. ఈ సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదు గుర్తించింది. ఈ మేరకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్రెడ్డి నివాసాల్లో జరిగిన సోదాలపై ఈడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ పేర్కొంది.
#Telangana: The ED is conducting searches at the premises of @BRSparty MLA Gudem Mahipal Reddy and his brother Gudem Madhusudan Reddy in connection with an alleged illegal mining-linked money laundering case.pic.twitter.com/wrwtaNj8d5
— The Munsif Daily (@munsifdigital) June 20, 2024
మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉందని, మహిపాల్రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని ఈడీ అధికారులు తెలిపారు. బినామీ పేర్లతో లావాదేవీలనూ ఈడీ గుర్తించింది. శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఈడీ అధికారులు.. సోదాలు కొనసాగిస్తున్నారు.
BRS questions ED raids at party MLA Mahipal Reddy's properties
— PTI News Alerts (@PTI_NewsAlerts) June 21, 2024
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/SUjZh1RFoU
ఒక్క తప్పూ చేయలేదంటూ హరీశ్ రావు
కాగా, ఈడీ దాడులపై బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని ఆరోపించారు. మహిపాల్ రెడ్డి నివాసంలో కనీసం డబ్బు, బంగారం కానీ అక్రమంగా దొరకలేదని చెప్పుకొచ్చారు. ప్రతిదీ ఐటీ రిటర్న్స్తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయన్నారు. ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications