వర్షాలు: వరంగల్లో భూమిలో నుంచి గాలి, బుడగలు
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ములుగు మండలం రామచంద్రాపురంలోని ఊరచెరువులోనుంచి గాలి బుడగలు వచ్చాయి. ఇటీవల ఓ రైతు వ్యవసాయ భూమిలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వాటిని మంగళవారం భూగర్భ శాఖ అధికారులు పరిశీలించారు.
అధిక వర్షాలకు గాలితో పాటు నీరు కూడా భూగర్భంలోకి చేరిందని, ఈ గాలి భూమి పొరలలోని గాలికి తోడై బయటకు వస్తున్నట్లు చెప్పారు.

ఈ ప్రాంతంలో సున్నపు గుణం కలిగిన డోలమైట్ రాయి ఉందని, కాల్షియం భూమిలోకి వచ్చిన నీటితో కలిసి రసాయన ప్రక్రియ జరిగిందని, తద్వారా రాయి కరిగి, ఖాళీ ప్రదేశం ఏర్పడి అందులోకి గాలి చేరిందన్నారు. ఆ గాలి బయటకు వస్తోందని చెప్పారు. బుడగలు అదే పద్ధతిలో వస్తున్నాయన్నారు.
ఆ పొలంలో నీరు ప్రవహిస్తున్నట్లు శబ్ధం రావడంతో అధికారులు పరిశీలించారు. భుగర్భంలో జలధారలు ప్రవహిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications