ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి చేసిన 57మంది రైతులపై కేసులు.. 12మంది అరెస్ట్; రిమాండ్!
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీపై రగడ కొనసాగుతోంది. నేడు కూడా రైతుల ఆందోళనలు, పోలీసుల కేసులు, అరెస్టులతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న జరిగిన దాడికి సంబంధించి మొత్తం 57 మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంత మంది రైతులతో సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉధృక్తత కొనసాగుతోంది.
ఇథనాల్ ఫ్యాక్టరీ దాడి,... పలువురు రైతుల అరెస్ట్, రిమాండ్
అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలభై మంది పరారీలో ఉన్నారని, మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసినట్లు రాజోలీ సబ్ ఇన్స్ పెక్టర్ జగదీశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద ధన్వడా, చిన్న ధన్వడా గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి యూనిట్ పైనా, కొంత మంది ఫ్యాక్టరీ సిబ్బందిపై దాడి చేశారని సబ్ ఇన్స్ పెక్టర్ తెలిపారు.

కంపెనీ ఆస్తులపై 12 గ్రామాల రైతులు దాడి..40 లక్షల ఆస్తి నష్టం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టిన దగ్గర 12 గ్రామాల రైతులు దాడి చేశారని, కంపెనీ నిర్మాణం చేపట్టే ప్రదేశంలో భారీ వాహనాలను, యంత్ర సామాగ్రిని, కూలీల పూరి గుడిసెలు, కంటైనర్లను తగులబెట్టి, వారి వాహనాలను ధ్వంసం చేశారని, సుమారు రూ 40 లక్షల ఆస్తి నష్టం చేశారని యజమాని మంజునాథ్ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
57 మందిపై కేసు నమోదు చేయగా 12 మంది నేడు అరెస్ట్
కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు ఇప్పటికి 57 మందిపై కేసు నమోదు చేయగా 12 మందిని నేడు అరెస్ట్ చేసి గద్వాల కోర్టులో హాజరు పరచి రిమాండ్కు తరలించారు.మరికొందరి కోసం నోటీసులు జారీ చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక తాజా పోలీసు కేసులతో సమీప గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తమకు ఇష్టం లేదని చెప్తున్నా మా ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ వైఖరిపై రైతుల తీవ్ర ఆగ్రహం
. రైతులపై కేసులు పెట్టి, ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ వైఖరికి వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఎలా ఏర్పాటు చేస్తారో తామూ చూస్తాం అంటూ రైతులు తేల్చి చెప్తున్నారు. తమ ప్రాణాలు కార్పోరేట్లకు పణంగా పెట్టలేం అంటున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications