శ్రీశైలం డ్యామ్ విషయంలో కేంద్రం కీలక అడుగు.. రంగంలోకి నిపుణులు!
కేంద్ర ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు పనుల పైన శుభవార్త చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ మరమ్మతు పనులకు కీలక అడుగు పడింది. నేషనల్ డాన్ సేఫ్టీ అథారిటీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మత్తులపై కీలక అడుగు
ఈ బృందం త్వరలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్లంజ్ పూల్ కు జరిగిన నష్టం, మరమ్మతుల అవసరం పైన విస్తృతంగా అధ్యయనం చేస్తుంది. గతంలోనూ దీనిపైన నిపుణుల కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేసింది. అయితే ఆ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. గత ఆరు సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ అంశం పైన మళ్లీ ఇప్పుడు తాజాగా అడుగులు పడుతున్నాయి.

కేంద్రప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల బృందం ఇలా
ఈ ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందానికి సిడబ్ల్యుసి చీఫ్ ఇంజనీర్ డిజైన్స్ వివేక్ త్రిపాఠి నాయకత్వం వహిస్తారు. బృందంలో జలసంఘం నుండి సోమేశ్ కుమార్, సుమంత్, అరుణ్ ప్రతాప్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్,మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుండి మనీష్ గుప్తా, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుండి ఎంకే వర్మ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శైలేంద్ర సింగ్, శ్రీశైలం డ్యాం చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ లో దెబ్బ తిన్న ఆప్రాన్ మరియు ప్లంజ్ పూల్
తెలంగాణ నీటిపారుదల శాఖతో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డులు కూడా తమ ప్రతినిధుల వివరాలను తెలపాలని సి డబ్ల్యూ సి కోరింది.అయితే శ్రీశైలం డాం దిగువన ఆప్రాన్ మరియు ప్లంజ్ పూల్ తీవ్రంగా దెబ్బతిందని, భద్రతాపరమైన ప్రమాదం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా శ్రీశైలం డ్యామ్ ను ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది.
స్పిల్ వేకు ప్రమాదం ఉందని హెచ్చరిక
శ్రీశైలం డామ్ ను పరిశీలించి భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసింది. ప్లంజ్ పూల్ లోతు 122 మీటర్ల నుండి 160 మీటర్లకు పెరిగిందని, ఆప్రాన్ నుండి 50 నుంచి 250 మీటర్ల వరకు గుంతలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్పిల్ వేకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంకా అనేక కీలక సూచనలు కూడా చేశారు.
శ్రీశైలం మరమ్మత్తు పనులలో కీలక అడుగు
అయితే అవి ఇప్పటివరకు కాగితాలకే పరిమితం కాగా, తాజాగా మరోమారు కేంద్రం దీనిపైన అధ్యయనం కోసం టెక్నికల్ టీం ను ఏర్పాటు చేసింది. ఈ టీం శ్రీశైలం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేస్తుంది. సాంకేతిక సమీక్ష నిర్వహిస్తుంది. మరమ్మతు పనుల కోసం స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ టీంను ఏర్పాటు చేసే అధ్యయనం చేయడం ఏళ్ళ కాలంగా పెండింగ్లో ఉన్న శ్రీశైలం మరమత్తు పనులలో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications