బిజెపి, టిడిపి బహిరంగ సభ: లోకేష్ సహా చంద్రబాబు హాజరు, రాజాసింగ్కు నో ప్లేస్
హైదరాబాద్ : బిజెపి, టిడిపి కూటమి గ్రేటర్ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటైన బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు బిజెపి నేత, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు.
ఈ బహిరంగ సభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సి, చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కూడా హాజరయ్యారు. బిజెపి నేతలు జి. కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి, టిడిపి నాయకుడు సుజానా చౌదరి కూడా వచ్చారు. కేంద్ర మంత్రి నడ్డా కూడా హాజరయ్యారు.

కాగా, బిజెపి శానససభ్యుడు రాజాసింగ్ ఫోటో గానీ, ఫ్లెక్సీ గానీ బహిరంగ సభలో కనిపించలేదు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయనను ఈ సభకు ఆహ్వానించలేదని సమాచారం.
గత 18 నెలల కాలంలో మెదక్, వరంగల్ లోక్సభకు ఎన్నికలు జరిగినా ఎక్కడా చంద్రబాబు తెరమీదకు రాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కేవలం తెరవెనుక ఉండి టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేయడానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం బాబు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.. సీనియర్ల మధ్య సమన్వయం లేని పరిస్థితుల్లో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. ఈఎన్నికల ప్రచారానికి చంద్రబాబు రావడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications