బిగిస్తున్న ఉచ్చు: కేశవరెడ్డిపై తెలంగాణలోనూ కేసు
దుండిగల్: కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిపై తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి చీటింగ్ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలోని కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు 20మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజానికి వీరు నెల రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా సివిల్ కేసంటూ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. చివరికి బాధితులు శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలవడంతో దుండిగల్ పోలీసులు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని బాచుపల్లి, కంది బ్రాంచీల్లో 260మంది విద్యార్థులు కేశవరెడ్డి విద్యాసంస్థల్లో చదువుతున్నారు.

పాఠశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి డే స్కాలర్కు రూ.2 లక్షలు, రెసిడెన్షియల్కు రూ.4 లక్షల చొప్పున డిపాజిట్ రూపంలో వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం విద్యాసంవత్సరం పూర్తయిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు కోరితే డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించేలా అంగీకారం కుదిరింది.
అయితే నిరుడు పదో తరగతి పూర్తిచేసిన 16మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నా డిపాజిట్ సొమ్మును తిరిగి ఇవ్వడంలేదు. పైగా పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసేందుకు వచ్చారంటూ వారిపై ఎదురు కేసులను నమోదు చేయించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications