కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించిన కేసీఆర్..
రూ. 62,908లతో 20.28 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి స్వామికి బంగారు మీసాలు చేయించారు.
తిరుపతి: తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమల పర్యటన కొనసాగుతోంది. బుధవారం నాడు వెంకన్న దర్శనం చేసుకున్న ఆయన.. నేడు కురవి వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్బంగా వీరభద్రస్వామికి బంగారు కోర మీసాలను సీఎం సమర్పించారు. రూ. 62,908లతో 20.28 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి స్వామికి బంగారు మీసాలు చేయించారు. కానుకలు సమర్పించుకున్న తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం సీఎంకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ
సందర్బంగా సీఎం కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ లు వీరభద్రస్వామి ఆలయానికి వచ్చారు.
కాగా, బుధవారం నాడు వెంకన్నను దర్శించుకున్న కేసీఆర్.. రూ.5కోట్లతో మొక్కు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. 14.2 కిలోల బంగారు సాలిగ్రామహారం, 4.65 కిలోల బంగారు కంఠెను ఆయన స్వామి వారికి సమర్పించారు.
అయితే సీఎం తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనాన్ని దేవుళ్లకు ఖర్చుపెట్టడమేంటని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాస్వామిక వాదులు ఆయన్ను నిలదీస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications