సాంబార్లో బొద్దింక-హైదరాబాద్ ఫేమస్ హోటల్ పై కస్టమర్ ఫిర్యాదు..!
హైదరాబాద్ లో హోటల్స్ లో ఆహారం పరిస్ధితి ఎలా ఉందో నిరూపించే మరో ఘటన ఇవాళ చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత యథావిథిగా హోటళ్లలో తినేందుకు వెళ్తున్న ఆహార ప్రియులకు గట్టి షాక్ తగిలింది. ఓ హోటల్లో వడ్డించిన సాంబార్ లో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమర్ హోటల్ సిబ్బందిని నిలదీశాడు. వారు ఏదో సర్ది చెప్పబోతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఉన్న మినర్వా హోటల్లో తాను వెళ్లినప్పుడు ఎదురైన ఈ చేదు అనుభవంపై హైదరాబాద్ కు చెందిన రాణా అనే కస్టమర్ ఇవాళ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తాను హోటల్కి వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ని ఆర్డర్ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. సిబ్బంది తెచ్చిన సాంబార్ డిష్లో పురుగులు కనిపించాయని ఆరోపించాడు. దీంతో సదరు హోటల్ లో పరిస్ధితులు ఎలా ఉన్నాయో వివరిస్తూ ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపాడు.

తన ఫిర్యాదును అత్యవసరంగా విచారించి, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా హోటల్పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదులో కోరాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కూడా అధికారుల్ని కోరుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రజారోగ్యం, భద్రత ప్రమాదంలో ఉన్నందున, దయచేసి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా బాధితుడు కోరాడు. ఇప్పటికే జంట నగరాల్లోని పలు ప్రముఖ హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు లోపాలు గుర్తిస్తున్న అధికారులు.. ఈ హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications