జాతీయ స్థాయిలో కాంగ్రెస్ హావా.. అజారుద్దిన్
ప్రధాని నరేంద్రమోడీ అభివృద్దికంటే వ్యక్తిగత విమర్శలకే ఎక్కువగా ప్రాధాన్య మిస్తున్నాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దిన్ విమర్శించారు. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలీ వీస్తుందని అయన జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. అసలు ఉద్యోగాల విషయమే మోడీ ఎక్కడా ప్రస్థావించడం లేదని దుయ్యబట్టారు.
మోడీ అభివృద్ది విషయాలను చర్చించకుండా రాజకీయ విమర్శలకు దిగుతున్నాడని ఆరోపించారు. మోడీ ఏం చేశాడో ప్పుకోలేని స్థితిలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే మోడీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడతారని ఆయన అన్నారు. ఇక యూపిఏకు టీఆర్ఎస్ మధ్దతుపై ఆయన స్పందించారు. టీఆర్ఎస్ మద్దతు అవసరం అని భావిస్తే కేంద్రం స్పందిస్తుందని తెలిపారు.

ఇటివల హైదారాబాద్ అంబర్పేట్లో మసీదును కూల్చివేసిన ఘటనపై స్పందించిన ఆయన మజీద్ను అక్రమంగా కూల్చివేశారని ఆరోపించారు. పురాతణ మజీదు అని గౌరవం లేకుండా కూల్చివేశారని అయన మండిపడ్డారు.ఇక కూల్చివేతలకై నష్టపరిహారం ఇచ్చామని చెబుతున్న అధికారులపై కూడ ఆయన ఫైర్ అయ్యారు.అది వక్ఫ్ కు సంబంధించి ఆస్థి అయితే ఇతరులకు ఎలా నష్టపరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications