గవర్నర్ 'కేసీఆర్' భజన పదవిని పొడగించుకోవడానికే..: షబ్బీర్ అలీ
గవర్నర్ తన పదవిని పొడగించుకునేందుకే కేసీఆర్ భజన చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఆరోపించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలో గడిచిన 31నెలల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి గూర్చి ప్రస్తావిస్తూ గవర్నర్ నరసింహన్ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యలపై స్పందించారు.

సోమవారం నాడు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వైఖరిని తప్పుబట్టింది. అనంతరం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ గవర్నర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ తన పదవిని పొడగించుకునేందుకే కేసీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ను డైనమిక్ లీడర్ అంటూ పొగడిన గవర్నర్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్ లో డైనమిజం ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనియాదవ్ ను మంత్రిగా ప్రమాణం చేయించడం ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గవర్నర్ నీరుగార్చారని షబ్బీర్ అలీ ఆరోపించారు. కేవలం తన పదవీకాలాన్ని పొడగించుకోవాలన్న ఉద్దేశ్యంతోనే గవర్నర్ కేసీఆర్ భజన మొదలుపెట్టారని విమర్శించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications