హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతులపై పోలీసు దాడి: పబ్‌కు వెళ్లలేదని మొర

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలోని అమీర్‌పేట గ్రీన్‌లైన్స్‌ హోటల్స్‌ వద్ద దంపతులపై పంజాగుట్ట పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం అర్థరాత్రి చంద్రబాబు, జ్యోతి దంపతులు ఓ ఫంక్షన్‌కు హాజరై ఇంటికి వెళ్తుండగా బైక్‌పై నుంచి పడిపోయారు. దీంతో నడిరోడ్డుపై గుంత ఉండటాన్ని నిరసిస్తూ దంపతులు ఆందోళనకు దిగారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ట్రాఫిక్‌జామ్‌కు కారణమంటూ దంపతులను పోలీసులు విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. తమ రెండేళ్ల కుమారుడితో కలిసి స్కూటీపై వస్తుండగా బేగంపేట లైఫ్ స్టైల్ సమీపంలో రోడ్డుపై గుంత కారణంగా పడిపోయారు. గాయపడిన దంపతులు జిహెచ్ఎంసి అధికారుల తీరును నిరసిస్తూ దంపతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అందుపులోకి తీసుకుని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు.

couple protest against Hyderabad police behaviour

ఆ క్రమంలో దంపతులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ విషయం తెలిసి మీడియా ప్రతినిధులు పంజగుట్ట పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. చందూ తాగి పోలీసులతో ఘర్షణకు దిగడం వల్నలే తాము అదుపులోకి తీసుకున్నామని ఎసిపి వెంకటేశ్వర రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమను అన్యాయంగా కొట్టారని జ్యోతి కన్నీరు పెట్టింది. తాము పబ్‌కో మరెక్కడికో వెల్లలేదని, బల్కంపేటలో ఉయ్యాల వేడుకకు వెళ్లామని ఆమె చెప్పారు.

గుంత కారణంగా పడిపోయిన తమను ఏం జరిగిందని కూడా అడకుండా కానిస్టేబుల్ వస్తూనే తమపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. పోలీసు స్టేషన్‌కు తీసుకుని వచ్చిన తర్వాత కూడా తన భర్తను విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించింది. అడ్డం వెళ్లిన తనపై కూడా దాడి చేశారని ఆమె చెప్పింది. బాధలో తన భర్త పొరపాటున మాట జారి ఉండవచ్చు, దానికి పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడం మరింత బాధాకరంగా ఉందని ఆమె అన్నారు.

English summary
It is alleged that police have attacked couple Chandrababu and Jyothi in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X