ఎర్రవల్లి తరహా డబుల్బెడ్రూం ఇళ్లు ఇక్కడా కట్టండి: చాడ హెచ్చరిక
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జీ, జీప్లస్ వన్ ఇళ్లను అంటగట్టి వారి పొట్టకొట్టవద్దని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంక్రెడ్డి అన్నారు.
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు జీ, జీప్లస్ వన్ ఇళ్లను అంటగట్టి వారి పొట్టకొట్టవద్దని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంక్రెడ్డి అన్నారు. ఒక ఎర్రవల్లిలోనే కాకుండా అదే తరహాలో వరంగల్లోని ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం హన్మకొండ ఏకశిల పార్కులో సీపీఐ నగర పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న గుడిసెవాసులందరికీ పట్టాలిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రతీపేదవాడికి 125 గజాల ఇళ్ల స్థలాన్ని కేయించి 2 గందుల ఇళ్లను క్టిస్తానన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో 58ని అమలు చేసి పేదలక న్యాయం చేయాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో సీసీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం పార్క్ నుంచి కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయల్దేరిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే సీపీఐ నాయకులు రాస్తారోకో చేప్టారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో తోపులాట జరిగింది. పలువురు సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీసుస్టేషన్కు తరలించారు. కొద్ది సేపటికే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. శ్రీనివాస్రావు, జిల్లా కార్యదర్శి సిరిబోయిన కరుణాకర్, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.
జేసీకి వినతి పత్రం
జీవో 58 ప్రకారం గుడిసెవాసులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఏకశిలా పార్కులో ధర్నా చేపట్టిన సీసీఐ నాయకులు అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి జేసీ దయానంద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వాలని వెంక్రెడ్డి కోరారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications